హైదరాబాద్ : 20 ఏళ్ళు కూడా నిండని ఓ యువతి రేపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుంది. అయితే ఈ బాధ్యతలు కేవలం ఒక్కరోజు మాత్రమే. రేపు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోనుంది. ఈ మేరకు రేపు ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టనుంది. ఇంతకి సీఎం కుర్చీలో కూర్చునేది హరిద్వార్ నివాసి సృష్టి గోస్వామి. ఈ యువతి బీఎస్సీ డిగ్రీ చదువుతోంది. ఉత్తరాఖండ్ బాలికల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ మేరకు సృష్టిని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించింది. దీంతో రేపు ఈ యువతి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్తో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై సమీక్ష నిర్వహించనుంది. ఈ సమీక్షకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో రేపు ఉత్తరాఖండ్ లో నవ పాలన కొనసాగనుంది. కాగా సృష్టి గోస్వామి 2018లో ఉత్తరాఖండ్ బాలల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jan,2021 03:35PM