హైదరాబాద్: ఆత్మహత్య చేసుకోవాలని భావించి రైల్వే ట్రాక్పై పడుకున్నాడో యువకుడు. రైలు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అనూహ్యంగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. అసలు ఆత్మహత్య చేసుకునే విషయం వారికెలా తెలిసిందో తెలియక కంగుతిన్నాడు. డయల్ 100 చేసిన సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి మరీ యువకుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ షాకింగ్ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని భువనగిరి సమీపంలో రైల్వే ట్రాక్పై పడుకున్నాడు. కొద్దిక్షణాల్లోనే యువకుడు సూసైడ్ చేసుకునేందుకు ట్రాక్పై పడుకున్నాడని డయల్ 100కి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది పెట్రోలింగ్లో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన భువనగిరి పెట్రోలింగ్ పోలీసులు రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి యువకుడికి షాకిచ్చారు. సురక్షితంగా తీసుకొచ్చారు. అనంతరం భువనగిరి పోలీసులు యువకుడికి కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm