హైదరాబాద్: సిరియా దేశంలో సైనికుల బస్సుపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ముగ్గురు సిరియన్ సైనికులు మరణించారు. మిలటరీ సిబ్బంది బస్సులో పల్ మైరా నుంచి డియర్ ఎజ్ జార్ కు వెళుతుండగా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు సైనికులు అక్కడికి అక్కడే మరణించగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సిరియా దేశంలోని అల్ షోలా పట్టణ సమీపంలో ఈ ఘటన జరిగింది. గత ఏడాది డిసెంబరు 30వతేదీన పౌరులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయంతో 28 మంది మరణించగా, మరో 13 మంది గాయాల పాలయ్యారు. దక్షిణ సిరియాలోని టాన్స్ ప్రాంతంలో జోర్డాన్ సరిహద్దుల్లో అమెరికా మిలటరీ దళాలు నియంత్రిస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm