హైదరాబాద్ : దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 13,203 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 13,298 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,67,736కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 131 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,470 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,03,30,084 మంది కోలుకున్నారు. 1,84,182 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 16,15,504మందికి వ్యాక్సిన్లు వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm