హైదరాబాద్ : కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కడప జిల్లాలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఐటిఐ సర్కిల్ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షకు దిగారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన ర్యాలీలో అఖిలపక్ష పార్టీలు రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm