హైదరాబాద్: మరోసారి కేసీఆర్ ఫ్యామిలీపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కేటీఆర్ను త్వరలోనే కేసీఆర్ సీఎం చేస్తారన్న వార్తలపై రేవంత్ స్పందించారు. రాష్ట్రానికి సీఎంగా మంత్రి కేటీఆర్ని చేయడం కేసీఆర్ కు ఇష్టం లేదన్నారు. అంతేకాకుండా కేటీఆర్ సమర్థత ఏమిటో కేసీఆర్ కు బాగా తెలుసన్నారు. మీడియాతో చిట్చాట్ చేసిన రేవంత్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సీఎం ఎవరు అవుతారనేది కల్వకుంట్ల కుటుంబ సమస్య మాత్రమేనన్నారు. ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఒకవేళ కేటీఆర్ సీఎం అయితే మాత్రం ప్రధాన సమస్య హరీష్రావు, సంతోష్రావు, కవితకే ఉంటుందన్నారు. కేటీఆర్ సీఎం కాకుండా వీళ్లే అడ్డుకుంటారన్నారు.
మరోవైపు ఇప్పటికే చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు... కేటీఆర్ సీఎం అయ్యేందుకు అన్నివిధాల సమర్థుడంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే వారిని కూడా ప్రశ్నిస్తూ రేవంత్ పలు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ సమర్థుడంటున్న నాయకులు కేసీఆర్ అసమర్థుడని ఒప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు. మంత్రి పదవులు కావాలనేవారు ముఖ్యమంత్రి మారాలనుకుంటున్నారన్నారు. కానీ సీఎంగా కేటీఆర్ను చేయనే చేయరన్నారు. కేటీఆర్కు సీఎం అయ్యేందుకు అర్హతే లేదని, కానీ సీఎం కేసీఆర్ చెప్పే అబద్ధాల కంటే కేటీఆర్ చెప్పుతున్న అబద్ధాలే ఎక్కువగా ఉంటున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందని సీఎం కేసీఆర్ అనుకుంటే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను సీఎం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Jan,2021 12:36PM