హైదరాబాద్ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో పలు చోట్ల తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై రైతు సంఘాల నాయకులు స్పందించారు. శాంతియుతంగా చేపట్టిన ర్యాలీని.. కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రైతుసంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ ఆరోపించారు. అయితే వారిని అన్నదాతలు గుర్తించారని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా అందులో ఉన్నట్లు స్పష్టం చేశారు. అక్కడక్కడా జరిగిన అల్లర్లను నేతలు ఖండించారు. ఇలాంటి ఘటనలు ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు. అలాంటి వారితో తాము కలిసి పోరాడాలని అనుకోవడం లేదని వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm