So here goes.. @sivakoratala @MatineeEnt@KonidelaPro @AlwaysRamCharan
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2021
#Acharya pic.twitter.com/YdZ84lkXhL
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రుపోందుతున్న చిత్రం 'ఆచార్య'. ఇక మెగాభిమానులు ఈ చిత్ర టీజర్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలియంది కాదు. నూతన సంవత్సరం రోజున, లేదంటే.. సంక్రాంతికి ఈ చిత్ర టీజర్ వస్తుందని అభిమానులు భావించారు. కానీ ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులే కాదు.. చిరంజీవి కూడా కాస్త నిరాశకు లోనైనట్లుగా తాజాగా ఆయన ట్వీట్ చూస్తే తెలుస్తోంది.
కొరటాల శివ, చిరుల మధ్య ఈ టీజర్ విషయంలో జరిగిన ఆసక్తికర సంభాషణను చిరంజీవి తన ట్విట్టర్లో షేర్ చేశారు. వారిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉందంటే..
చిరంజీవి: ఏమయ్యా కొరటాల.. ఆచార్య టీజర్ న్యూ ఇయర్కి లేదు, సంక్రాంతికి లేదు.. ఇంకెప్పుడు..
కొరటాల: సార్.. అదే పనిలో ఉన్నా..
చిరంజీవి: ఎప్పుడో చెప్పకపోతే.. లీక్ చేయడానికి సిద్ధంగా ఉన్నా..
కొరటాల: రేపు మార్నింగే అప్డేట్ ఇస్తా.. సార్..
చిరంజీవి: ఇస్తావా..
కొరటాల: రేపు మార్నింగ్ 10 గంటలకు ప్రకటన.. ఫిక్స్ సార్
దీంతో 'ఆచార్య' టీజర్ ప్రకటన రేపు ఉదయం 10గంటలకు అంటూ కొరటాల అఫీషియల్గా ట్వీట్ చేశారు.