హైదరాబాద్: అన్నాడీఎంకే బహిష్కృత నేత, జయలలిత స్నేహితురాలు వీకే శశికళ జైలు జీవితం ముగియనుంది. అవినీతికి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆమెను ఇవాళ విడుదల చేయనున్నారు అధికారులు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఆస్పత్రిలోనే పూర్తి చేయనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. కరోనా బారిన పడ్డ శశికళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విడుదలైన తర్వాత కూడా ఆమె ఆస్పత్రిలోనే ఉండనున్నారు. జనవరి 20న శశికళకు కరోనా సోకింది. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో ఉన్నారు. ఆమెను ఎప్పుడు డిశ్ఛార్జి చేస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఆస్పత్రి వర్గాలతో చర్చించి డిశ్ఛార్జిపై నిర్ణయం తీసుకుంటామని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm