ముంబయి: పార్లమెంట్ సభ్యుడు మోహన్ దేల్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. దక్షిణ ముంబయిలోని ఓ హోటల్లో పోలీసులు దేల్కర్ మృతదేహాన్ని గుర్తించారు. మోహన్ దాద్రా నగర్ హవేలీ స్థానం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాద్రా నగర్ హవేలీకి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన 2019లో పార్టీని వీడారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ స్థానం నుంచి ఆయన ఏడు సార్లు ఎంపీగా గెలుపొందారు. సిల్వస్సాలో ట్రేడ్ యూనియన్ లీడర్గా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించిన .. 1989లో తొలిసారిగా లోక్సభ ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2009 వరకు వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమిచెందారు. ఆ తర్వాత పార్టీని వీడిన .. గత ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగి మళ్లీ విజయం సాధించారు. మోహన్కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే దక్షిణ ముంబయిలోని ఓ హోటల్లో దేల్కర్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఎంపీ ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఎంపీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హోటల్ గదిలో గుజరాతీలో రాసిన లేఖ ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళిసై నిర్ణయమే కీలకం Click Here