హైదరాబాద్: తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని తమ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో ఈ సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తమ పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్, ఇతర నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి పోటీ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm