హైదరాబాద్ : టీఆర్ఎస్ నేత గోవర్ధన్రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదలలో గోవర్ధన్ రెడ్డి ఇంటితో పాటుగా ఆయన బంధువులు, పరిశ్రమల్లో కూడా ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 12 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. ఆయనకు ఉన్న రెండు కంపెనీలలో అవకతవకలు జరిగాయన్న సమాచారం మేరకు, ఆదాయనికి మించి ఆస్తుల విషయంపై కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm