హైదరాబాద్ : అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో మాస్కులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అతి త్వరలోనే మాస్కుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇందుకు ఎంత ఖర్చు కానుంది, ఎలాంటి మాస్కులు అందిస్తారనే విషయంపై శ్వేతసౌధం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలోనే మాస్కులు పంపిణీ చేయాలని భావించినప్పటికీ అది అమలు కాలేదు. కాగా జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మొదటి వంద రోజులు ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన కోరారు. ప్రజా రవాణా, కార్యాలయాల్లోనూ మాస్కులు ధరించడాన్ని బైడెన్ తప్పనిసరి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Feb,2021 07:23PM