హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లూనాయక్ తండాలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో జేసీబీతో పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు రైతులు మృతి చెందారు. జేసీబీ బకెట్ రైతులు మీద పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm