హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలో ఓ యువకుడు హల్ చల్ సృష్టించాడు. నడిరోడ్డుపై ట్రాఫిక్ పోలీసుల మీద దాడికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. సైలెన్సర్ తీసేసి మితిమీరిన శబ్దంతో వెళ్తుండగా పోలీసులు అతడిని అడ్డుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 1లో టీవీ5 కార్యాలయం మీది నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వైపు టీఎస్ 07ఈఎక్స్ 0906 బైక్పై ఓ యువకుడు మితిమీరిన శబ్దంతో వస్తున్నాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ సీఐ ఆ బైక్ను ఆపాల్సిందిగా హోంగార్డు రాథోడ్కు సూచించారు. ఆయన వాహనాన్ని నిలిపేందుకు ప్రయత్నించగా మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు రెచ్చిపోయాడు. హోంగార్డును దుర్భాషలాడుతుండగా.. నిలదీసేందుకు సీఐ వెళ్లగా ఆయన్ని నెట్టేసి దాడికి పాల్పడ్డాడు. పోలీసు సిబ్బందితో పాటు ఇతర వాహనదారులు ఎంత చెప్పినా అతడు వినిపించుకోకుండా నానా హంగామా సృష్టించాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని మాసబ్ట్యాంక్ శ్రీనగర్ కాలనీలో మెట్రో పొలైట్ కేఫ్ యజమాని మేసమ్ దర్విష్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దర్విష్, అతడి స్నేహితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm