హైదరాబాద్: హైదరాబాద్లోని హిమయత్నగర్ వై జంక్షన్లో బుధవారం బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో షాలిని అనే గర్భిణి మృతి చెందగా, ఆమె భర్త సతీష్గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. షాలినికి బంధువులు గురువారం అంత్యక్రియలు నిర్వహించగా ఆమె భర్త స్ట్రెచర్పై వచ్చి భార్యను కడసారి చూసుకున్నాడు. ఈ సన్నివేశం చూసిన కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉప్పల్కు చెందిన షాలినీకి బాకారానికి చెందిన సతీష్గౌడ్కు 8 సంవత్సరాల క్రితం పెళ్లయింది. పెళ్లయిన ఐదేళ్లకు కూతురు సహస్ర (ఏడాదిన్నర) జన్మించింది. షాలిని ఇటీవల మళ్లీ గర్భం దాల్చడంతో చెకప్ కోసం సతీష్ ఆమెను బుధవారం బైక్పై ఆస్పత్రికి తీసుకెళ్లి వస్తుండగా హిమయత్నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో షాలిని ప్రాణాలు కోల్పోయింది. కాలు విరగడంతో సతీష్గౌడ్ను హిమయత్నగర్లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
గురువారం సాయంత్రం బాకారంలోని శ్మశాన వాటికలో షాలిని అంత్యక్రియలు జరిగాయి. ఆసుపత్రి నుంచి అంబులెన్స్లో వచ్చిన సతీష్ స్ర్టెచర్పై పడుకునే భార్యను కడసారి చూసుకున్నాడు. తల్లిని కోల్పోయిన ఏడాదిన్నర కూతురిని చూస్తూ తీవ్ర ఉద్వేగానికి గురికావడం అందరినీ కలిచివేసింది. భార్య అంత్యక్రియలు ముగిసిన అనంతరం సతీష్గౌడ్ను తిరిగి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం అతడి కాలుకు ఆపరేషన్ చేయనున్నారు.
ఇదీ చదవండి :
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం...గర్భిణీ కడుపుపై నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు
దాదాపు అయిదారు నిమిషాలు..!
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Feb,2021 06:54AM