హైదరాబాద్: సీఎం కేసీఆర్పై ఏక్షణమైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేయడానికి అవకాశముందని, సీఎం కోటరీ చుట్టూ రైడ్స్ జరగొచ్చని బీజేపీ నేత కపిలవాయి దిలీప్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నామినేషన్ ఉపసంహరించున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సంపాదన అనిల్ అంబానీ కంటే ఎక్కువగా ఉందని, ఆ జాబితా అంతా ఈడీ దగ్గర ఉందని తెలిపారు. కేసీఆర్ కుటిల రాజకీయవేత్త అని విమర్శించారు. మాజీ ప్రధాని పీవీపై కేసీఆర్కు ఏనాడూ ప్రేమ లేదని, వాణిదేవిని బలిపశువును చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, సీఎం మాయమాటలకు లొంగొద్దని పట్టభద్రులకు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm