హైదరాబాద్: కుంట్లూర్కు చెందిన బాలిక అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 18వ తేది అదే గ్రామానికి చెందిన ఓ రియలేస్టేట్ వ్యాపారి వెంట వెళుతున్నట్లు ఒక ఉత్తరం రాసి ఇంట్లో పెట్టి వెళ్లింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఆ రోజే హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కుంట్లూర్లో నివాసం ఉండే బాలిక (18) హయత్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన పి. యాదయ్య కారులో ఎక్కి వెళ్లినట్లు స్థానికులు చెప్పారని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంత వరకు తిరిగి ఇంటికి రాక పోవడంతో భయమేస్తోందని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి ఆచూకీ కోసం ప్రత్యేక సిబ్బందిని వివిధ ప్రాంతాలకు పంపినట్లు సీఐ సురేందర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm