హైదరాబాద్ : చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో కలిసి పని చేసేందుకు మొగ్గుచూపడం లేదని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. ఈ క్రమంలో యూపీఏని తిరిగి పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కొత్త కూటమికి శరద్పవార్ లాంటి సీనియర్ నేత నాయకత్వం వహించాలని కోరారు. యూపీఏ భవిష్యత్తు అంతా కాంగ్రెస్ చేసే త్యాగాల మీదే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఔరంగాబాద్లో ఓ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన 'జై భీమ్ వేడుక'లో పాల్గొన్న సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్డీఏ లేదన్న రౌత్... ఇప్పటికే చాలా పార్టీలు కూటమి నుంచి వైదొలిగినట్లు గుర్తు చేశారు. అదే క్రమంలో యూపీఏ కూడా కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. దేశ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండాల్సిన ఢిల్లీలో.. ప్రభుత్వం స్తబ్దుగా ఉందని రౌత్ అన్నారు. మాట్లాడే కొద్దిమందిని కూడా అణిచివేస్తున్నారని ఆరోపించారు. కనీసం ఇతరులను కలిసే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని రౌత్ వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm