హైదరాబాద్ : చిత్తూరు పర్యటనలో భాగంగా ఈ ఉదయం రేణిగుంట చేరుకున్న చంద్రబాబును పోలీసులు విమానాశ్రయంలోనే నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్పందించారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా తెదేపా నిరసనకు అనుమతి ఇవ్వలేదు. ఇటువంటి కార్యక్రమాలకు ఎన్నికల సంఘం, పోలీసుల అనుమతి తప్పనిసరి. టీడీపీ నిరసన తెలపాలనుకున్న ప్రాంతం తిరుపతిలో కీలక ప్రాంతం. ఈ నేపథ్యంలో ఎటువంటి ఘర్షణలు జరగకూడదని అనుమతి ఇవ్వలేదు అని ఎస్పీ వివరించారు. అయితే పర్యటనకు అనుమతి లేదని చెప్పడంతో చంద్రబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, నాయకుల నుంచి పెద్ద ఎత్తున పోలీసుల తీరును తప్పుబడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm