హైదరాబాద్ : ప్రకృతి విపత్తు బాధితుల పేరిట విరాళాలు వసూలు చేస్తున్న మహిళలను ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలోని కరీంగూడ రోడ్డులో కొందరు మహిళలు వాహనదారులను విరాళాలు అడుగుతున్నారు. వారి మాటలు నమ్మి కొందరు విరాళాలు ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారిని యువతులు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. విరాళాలు సేకరించే సంస్థ పేరుగాని ఎవరికి వాటిని అందిస్తున్నారనే వివరాలు చెప్పకపోవటంతో వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సదరు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించి విచారణ జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm