హైదరాబాద్ : చలో, భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములను ఓ సైబర్ నేరగాడు మోసం చేశాడు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానల్ సభ్యుడినంటూ ఆ వ్యక్తి వెంకీకి ఫోన్ చేసి ఫిల్మ్ ఫెస్టివల్లో 'భీష్మ' చిత్రాన్ని ఆరు కేటగిరీల్లో నామినేట్ చేస్తామని చెప్పి ఒక్కొక్క కేటగిరీకి పదకొండు వేల రూపాయలు చొప్పున చెల్లించాలని చెప్పాడు. ఆ వ్యక్తి మాటలు నమ్మిన వెంకీ కుడుముల ఆరు కేటగిరీలకు కలిపి ఆరవై ఆరువేల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేశాడు. అయితే మరుసటి రోజు అదే వ్యక్తి ఫోన్ చేసి ఆరు కేటగిరిలకు సంబంధించి మూడింట నామినేషన్స్లో తప్పు జరిగిందని, సరి చేయడానికి కాస్త మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేయాలని చెప్పాడు. దాంతో అనుమానం వచ్చిన వెంకీ కుడుముల నామినేషన్ అవసరం లేదని చెప్పాడు. తర్వాత విషయాన్ని ఆరా తీయగా, తనకు వచ్చిన కాల్ ఫేక్ అని, జరిగిన మోసం తెలిసింది. దీంతో వెంకీ కుడుముల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్ నెంబర్, అకౌంట్ డీటయిల్స్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm