హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్లో విషాదం చోటు చేసుకుంది. ఉన్యానాయక్ అనే ఆకతాయి వేధింపులు తాళలేక ఈశ్వరమ్మ అనే వివాహిత అత్మహత్య చేసుకుంది. నార్సింగీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాల గూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఈశ్వరమ్మ ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తరచూ తనను పెళ్లి చేసుకోమంటూ వివాహితను ఉన్యా నాయక్ వేధింపులకు గురిచేశాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నార్సింగీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈశ్వరమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రెండు సంవత్సరాల క్రితం ఈశ్వరమ్మపై భర్త రెడ్యా నాయక్ కత్తితో దాడి చేశాడు. అప్పటి నుంచి భర్తకు ఈశ్వరమ్మ దూరంగా ఉంటోంది. ఈశ్వరమ్మ ఒంటరిగా ఉంటున్న నేపథ్యంలో ఈశ్వరమ్మను ఉన్యా నాయక్ పెళ్లి పేరుతో వేధింపులు గురి చేసినట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm