హైదరాబాద్ : ఓ యువతికి పెళ్లి నిశ్చయమైంది. వరుడు అనిల్ కుమార్ ను ఆమె నేరుగా చూడకపోయినా, వాట్సాప్ లో పంపిన ఫొటో చూసి పెళ్లికి అంగీకరించింది. దాంతో రెండు కుటుంబాల్లో పెళ్లిసందడి నెలకొంది. ఎంతో ఉత్సాహంగా పెళ్లిపనులు షురూ చేశారు. ఓ సుముహూర్తాన పెళ్లి చేసుకునేదుకు వరుడు, అతని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు.
అయితే, మాంగల్యధారణ జరిగే సమయంలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అప్పటివరకు పెళ్లికొడుకును ప్రత్యక్షంగా చూడని వధువు... పెళ్లికొడుకును తేరిపారి చూసి దిగ్భ్రాంతికి గురైంది. పెళ్లికొడుకు ఫొటోలో చూసిన విధంగా లేడంటూ అక్కడ్నించి పారిపోయింది. ఈ వింత ఘటన బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో చోటుచేసుకుంది. పెండ్లీ కూతురికి కుటుంబసభ్యులు ఎంత నచ్చచెప్పినా అతడిని పెళ్లి చేసుకునేందుకు ససేమిరా అంది. దాంతో పెళ్లిమండపం కాస్తా రణరంగమే అయింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో రసాభాసగా మారింది. పెళ్లి చేసుకోకుండానే పెళ్లికొడుకు అనిల్ కుమార్ వెనుదిరగక తప్పలేదు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 06 Mar,2021 07:26PM