హైదరాబాద్: మంత్రి కేటీఆర్కు ఎంపీ రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీది, బీజేపీది ఆత్మ ఒక్కటే శరీరాలే వేరు. ఎన్నికలప్పుడు కుస్తీ, తర్వాత దోస్తీ.. ఏడేళ్లుగా మీరు చేస్తున్నది ఇదే. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మీ నాన్న బీజేపీపై యుద్ధమన్నారు. అనంతరం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో రాజీ పడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మీరు మళ్లీ బీజేపీపై యుద్ధం అంటున్నారు. మీరు బీజేపీ ఒక్కటి కాకపోతే నాదొక సవాల్. ఐటీఐఆర్, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు.. జాతీయ హోదా కోసం జంతర్ మంతర్ దగ్గర దీక్షకు మీరు సిద్ధమా. దీక్షతో మోదీపై ఒత్తిడి పెంచుదాం వస్తారా?. నా సవాల్కు స్పష్టమైన సమాధానం ఇవ్వండి.. మీ దొడ్లో కుక్కలతో మొరిగించే ప్రయత్నం చేయొద్దు. ఈ సవాల్ను మీరు స్వీకరించకుంటే మోడీ తొత్తులుగా, శాశ్వతంగా తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు అని రేవంత్రెడ్డి హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm