హైదరాబాద్ : కాణిపాకం వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు. రాజమహేంద్రవరానికి చెందిన అభిరామ్, నెల్లూరు వాసి అలేఖ్య తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీటెక్ చదువుతున్నారు. ఆదివారం కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై కాణిపాకం బయల్దేరారు. ఐతేపల్లి వద్దకు చేరుకోగానే చిత్తూరు నుంచి తిరుపతి వస్తున్న ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అభిరామ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తీవ్ర గాయాలపాలైన అలేఖ్య తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm