హైదరాబాద్: ఎన్టీఆర్ విద్యాసంస్థలు గత ఆరేళ్లుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్(గెస్ట్)’ను ఈ నెల(మార్చి) 28న నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఉపకార వేతనం అందిస్తామన్నారు. మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5వేలు, తర్వాత 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.3వేల చొప్పున ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసే వరకు ఇవ్వనున్నట్లు భువనేశ్వరి తెలిపారు. ఈ అవకాశాన్ని పదో తరగతి చదువుతున్న బాలికలు వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తిగల బాలికలు https://ntrtrust.org/లో నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7660002627, 7660002628 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm