రాయ్పూర్: ఐదు రోజుల ఉత్కంఠకు తెర పడింది. మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ఎట్టకేలకు విడుదల అయ్యాడు. తమ చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ను మావోయిస్టులు విడిచిపెట్టారు. కొద్దిసేపట్లో రాకేశ్వర్ బెటాలియన్ వద్దకు చేరుకోనున్నాడు. బీజాపూర్ జిల్లా తర్రెం ఎన్కౌంటర్ అనంతరం మావోయిస్టులు సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్ రాకేశ్వర్ను ఎత్తుకెళ్లి పోయిన సంగతి తెలిసిందే. చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ మధ్యవర్తుల పేర్లు ప్రకటించాలని ప్రభుత్వానికి మావోయిస్టులు అవకాశం ఇచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాక ముందే మావోయిస్టులు రాకేశ్వర్సింగ్ విడుదల చేయడం ఆసక్తిగా మారింది. జవాన్ విడుదలను ఛత్తీస్గడ్ ఐజీ ధ్రువీకరించారు.
Mon Jan 19, 2015 06:51 pm