Jan 21,2019 01:01PM-11
అమరావతి: బీహార్ సీఎం నితీష్కుమార్కి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బీహార్కి చేపలు, రొయ్యల ఎగుమతులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. సముద్ర ఉత్పత్తులను నిల్వ ఉంచేందుకు ఫార్మాలిన్ వాడుతున్నారన్న ఆరోపణలతో ఎగుమతులు నిలిపివేశారని లేఖలో చంద్రబాబు వివరించారు. ప్రభుత్వ తనిఖీల్లో ఫార్మాలిన్ వాడటం లేదని తేలిందని స్పష్టం చేశారు. టాస్క్ఫోర్స్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే బిహార్ నుంచి అధికారుల బృందాన్ని పంపించి తనిఖీ చేసుకోవచ్చని సూచించారు. వెంటనే ఎగుమతులను పునరుద్ధరించాలని నితీష్కుమార్ను చంద్రబాబు కోరారు.