Oct 18,2019 11:20PM
అమరావతి: ఏపీ సర్కారు నిరుద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 8 అనుసరించి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కన్సల్టెన్సీ, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ తదితర రంగాల్లో ఈ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాల కల్పన చేపట్టనున్నారు.