హైదరాబాద్: మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్లో ఒక వ్యక్తి మృతదేహం రైలు పట్టాలపై ఓ వ్యక్తి పడి ఉన్నాడు. అందరూ చూస్తుండగానే అతనిపై మూడు రైలు వెళ్లాయి.చుట్టూ చూస్తున్నవాళ్లంతా షాక్ నుండి తెరుకోలేదు. అతడు లేచి కూర్చున్నాడు. అప్పటికే అతను చనిపోయాడేమో అని అక్కడ చూసిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు వచ్చి దగ్గరకు వెళ్లి చూడగానే అతను లేచి కూర్చున్నాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవాళ్లు షాక్ అయ్యారు. అకస్మాత్తుగా లేచిన అతను తన తండ్రి వచ్చాడంటూ అరవడం మొదలుపెట్టాడు.
వయక్తి లేచి పోలీసులతో పాపా ఆ గే అంటూ తండ్రి వచ్చాడు అని చెప్పడంతో పోలీసులకు ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు. అనంతరం ఆ వ్యక్తిని ఎవరు? అని ప్రశ్నించగా.. తన పేరు ధర్మేంద్ర అని చెప్పుకొచ్చాడు. ఆ వ్యక్తి తాగినట్లుగా పోలీసులు గుర్తించారు. అతను ట్రాక్ మీద పడుకున్నప్పుడు అతనికి తెలియకుండా పడుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతనిపై మూడు రైళ్లు ప్రయాణించిన విషయం కూడా అతనికి తెలియదు. అనంతరం అతనిని ప్రధమ చికిత్ప చేయించి అతనిని ఇంటికి పంపించారు. తాగిన మైకంలో ఒళ్లు తెలియకుండా పట్టాలపై పడగా అతను చాలా బక్కగా ఉండడంతో ప్రమాధం తప్పిందని పోలీసులు తెలిపారు. దీంతో అందరూ అతనిని మృత్యుంజయుడు అంటున్నారు.
Oct 23,2019 11:05AM