హైదరాబాద్ : 'కాలం వేగంగా పరిగెడుతోంది. నా తమ్ముళ్లు చాలా పెద్దవాళ్లైపోయారు' అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుల గురించి ట్వీట్ చేశారు. కీరవాణి చిన్న కుమారుడు సింహా హీరోగా, పెద్ద కుమారుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న సినిమా 'మత్తు వదలరా'. తాజాగా ఈ చిత్రం ఫస్ట్లుక్ను ఎన్టీయార్ ట్విటర్ ద్వారా విడుదల చేశారు. ఈ సినిమాతో అరంగేట్రం చేస్తున్న కాల భైరవ, సింహాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ కొత్తవాళ్లతో రూపొందుతున్న ఈ చిత్రం సస్సెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతో హీరోగా సింహా, మ్యూజిక్ డైరెక్టర్గా కాల భైరవ, డైరెక్టర్గా రితేష్ రానా, సినిమాటోగ్రాఫర్గా సురేష్, స్టంట్ కో-ఆర్డినేటర్గా శంకర్, నటులుగా నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర పరిచయమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని, మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Oct 23,2019 02:21PM