Nov 17,2019 06:59AM
మేడ్చల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.నారాయణరావు తెలిపారు. కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి సూచనల మేరకు రెడ్క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఆపద ఉన్నవారికి రక్తదానం అందించాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, కలెక్టరేట్లోని ఉద్యోగులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొనాలని ఆయన కోరారు.