హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని.. నిజాంసాగర్ జలాశయంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి ఎస్సై ఉస్సేన్ చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతిరాలి ఆచూకీ తెలిసిన వారు నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాల్సిందిగా కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm