విద్యార్థులు భవిష్యత్తులో క్రీడల్లో అద్భుత మైన ప్రతిభను కనబర్చి విజేతలుగా నిలవాలని ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ అన్నారు. శుక్రవారం మండలంలోని పసర సెయింట్ మేరీ పాఠశాల లో ఆటల పోటీల్లో ప్రతిభ కనపరిచి కేసీఆర్ కప్ విజేయలు అయిన చిన్నారులకు . అభినందనలు తెలిపి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులుఅంతర్జాతీయ పోటీలకు వెళ్ళడానికి తక్షణ సహాయం కింద 25 వేల రూపాయల చెక్కు అందించి ప్రోత్సహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏషియా గోవా అంతర్జాతీయ కప్ ఖర్చుల కు
మీకు నేను సహయం గా ఉంటాను అని తక్షణమే 25 వేల రూపాయలు చెక్కు ను అక్కడిక్కడే కరస్పాండెంట్ స్టీపెన్ రెడ్డి కి అందజేశారు. మారుమూల ప్రాంతాల్లో వెళ్లి గోల్డ్,కాస్యం, రజతం పతకాలు సాదించి జిల్లాకు మండలానికి తల్లిదండ్రులుకు,ఉపాధ్యాయులకు,కోచ్ కు మంచి పేరు తీసుకొని వచ్చారు. మరొక్కమారు చిన్నారులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులను అభినందనలు తెలిపారు.
ఏషియా గోవా అంతర్జాతీయ కప్ లో కూడా మీరు విజయం సాధిస్తారూ అని నాకు ఆ నమ్మకం ఉంది అని అన్నారు. చిన్నారులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులు వల్ల కుటుంబ సభ్యులతో జడ్పీ చైర్మన్ తో కలిసి సెల్ఫీ మీ మీ మీ ఫొటోలు దిగుతూ సంబరపడ్డారు. అనంతరం జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ ను సన్మానించారు. ఈయొక్క కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నిక నియోజకవర్గ కన్వీనర్ పోరిక గోవింద్ నాయక్,మైనార్టీ నాయకులు తాహిర్ పాషా, జి.కృష్ణ రెడ్డి, రాష్ట్ర యువజన నాయకులు ఎర్వ వెంకటాద్రి, ములుగు నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి నెమలి బాలకృష్ణ, పిఏసీఎస్ డైరెక్టర్ దూడపక రాజేందర్, మండల అధ్యక్షులు మురహరి భిక్ష పతి, ఉపాధ్యక్షుడు అజ్మిరా సురేష్ నాయక్, లాకావత్ నర్సింహా నాయక్, రైతు బంధు అధ్యక్షులు పిన్నటి మధు సుధన్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు వర్ధం చందర్ రాజు, బాణోత్ వెంకన్న, జన్నురాంబాబు, రుద్రబోయిన మల్లేష్, సీనియర్ నాయకులు రాజు నాయక్, ఉట్ల మోహన్,రాజశేఖర్,మువ్వ భాను,ముఖ్య నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Mar,2021 07:59PM