Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ముగ్గురు జీతగాళ్లు | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • సండే ఫన్
  • ➲
  • స్టోరి

ముగ్గురు జీతగాళ్లు

Sat 25 Jul 21:10:55.259311 2020

బండారుపల్లి జమిందారు రాషువరాయుడుకి వేలాది ఎకరాల భూముంది. పాతిక మంది వరకు జీతగాళ్లుండేవాళ్లు. వాళ్లతో వ్యవసాయం చేయిస్తూ, పశుపోషణ, పొలాల రక్షణ చేయిస్తుండేవాడు. ఏ ఒక్క జీతగాడి వేతనం మరో జీతగాడి వేతనంతో సమానంగా ఉండేది కాదు. వాళ్లు చేస్తున్న పనిని బట్టి, నెల జీతం ఇస్తుండేవాడు.
పెద్దోడి మెట్ట మొత్తం మూడు వందల ఎకరాలు. నల్లేరు వాగు బీడు భూమిలోంచి పక్క గ్రామంవైపు పారుతుం డేది. ఆ భూమిలో ఎటు వంటి పంట వేయకుండా, తన పశువులు మేయడానికి వదిలేశాడు.
తొలకరి వర్షాలు పడగానే, దాని కాపలాకు ముగ్గురు జీత గాళ్లు కావాలని గ్రామంలో చెప్పాడు. రంగయ్య, లింగయ్య, మంగయ్యనే ముగ్గురు యువ కులు జీతం చేయడానికి ముందు కువచ్చారు. తూర్పు వైపు రంగడ్ని, పడమర వైపు మంగయ్యను, దక్షిణం వైపు లింగయ్యను కాపలాకు వెళ్లమన్నాడు. మీ పనితనం చూసి, జీతం నిర్ణయిస్తానని చెప్పాడు.
నెల రోజుల తర్వాత ఓ రోజు జమిందారు బీడు భూమినంతా తిరిగి చూసి, ఇంటికి వచ్చాడు. రంగయ్యకు మూడు వేలు, లింగయ్యకు రెండు వేలు, మంగయ్యకు వెయ్యి రూపాయలు జీతం నిర్ణయించి, సాయంత్రం వచ్చిన ముగ్గురికీ ఇవ్వమని తన గుమాస్తాతో చెప్పాడు.
ముగ్గురూ జమిందారు వద్దకొచ్చి, ఒకే రకమైన కాపలా చేశాం. కానీ మా జీతాలు ఇలా ఎక్కువ తక్కువగా నిర్ణయించడం ఎందుకో అర్థం కావడం లేదు అన్నాడు మంగయ్య.
అప్పుడు జమిందారు వాళ్ల వైపు చూసి, నిన్ను బీడు భూమిలోకి పశువుల్ని రానీయకుండా చూడమంటే నువ్వేం చేశావు. ఉదయమే వెళ్లి, చింతచెట్టు కింద నిద్రపోయావు. గ్రామంలోని పశువులు బీట్లో పడి గడ్డి మేశాయి. నేను బీట్లో తిరిగినప్పుడు పశువుల పేడ కనిపించింది. నీ కాపలాకు వెయ్యే ఎక్కువ అన్నాడు.
నేను ఒక్క పశువును కూడా రానీయలేదు. కానీ నాకు రంగయ్య కంటే తక్కువ ఎందుకిచ్చారు? అడిగాడు లింగయ్య.
ముందు రంగయ్యకు ఎక్కువ జీతం ఎందుకు ఇచ్చానంటే, తను కాపలా చేస్తున్న బీడు భూమిలో ఒక్క పశువును పడనీయ లేదు. పైగా గెట్టు చుట్టూ వందలాది పండ్ల మొక్కలు నాటాడు. అవి పశువులు తినకుండా చుట్టూ రక్షణగా కంప ఏర్పాటు చేశాడు. రోజూ వాగులోని నీళ్లు పోసి ఒక్కటి కూడా చనిపోకుండా మొక్కలను బతికించాడు. ముందు ముందు ఆ చెట్లు చక్కని ఫలాల్నిస్తాయి. నేనేం మొక్కలు వేయమని చెప్పలేదు. కానీ తన ముందు చూపుతో, భావితరాలకు పనికొచ్చేలా పండ్ల మొక్కలు పెట్టాడు. అందుకే మూడు వేలుగా జీతంగా నిర్ణయించాను అన్నాడు.
ఇక లింగయ్య కేవలం కాపలా మాత్రమే కాశాడు. పశువులు పడకుండా చూశాడు. కానీ భూమిని, పారుతున్న నీటిని ఉపయోగించి, ఉపయోగపడే పనేమైనా చేయొచ్చుననే ఆలోచన చేయలేదు. అందుకే అతనికి రెండు వేలుగా జీతం నిర్ణయించాను. చెప్పకున్నా స్వంత ఆలోచన చేసి, భావి తరాలకు ఉపయోగపడేలా మొక్కలు నాటిన రంగయ్య నా దష్టిలో ఉత్తముడు. చెప్పిన పని చెప్పినట్లు మాత్రమే చేసిన లింగయ్య మధ్యముడు. తన కర్తవ్యం నిర్వర్తించకుండా, సోమరిగా కాలం గడిపిన మంగయ్య అధముడు. వారి పనిని చూశాకే ఈ విధంగా జీతం నిర్ణయించాను అన్నాడు జమిందారు.
రాఘవ రాయుడి వివరణతో - మంగయ్య, లింగయ్యలు సిగ్గుపడ్డారు. రంగయ్యలాగే బీడు భూమి చుట్టూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
మీరు నాటిన మొక్కలు బ్రతికాక, వాటిని పరిశీలించి మీకు జీతం పెంచుతానని హామీ ఇచ్చాడు రాషువ రాయుడు. ముగ్గురూ సంతోషంగా జీతం తీసుకుని ఇంటికి వెళ్లారు.
- పుప్పాల కష్ణమూర్తి, 9912359345

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

''పెళ్ళి సందడి'' చిత్రంలోని ''నవ మన్మధుడా అతి సుందరుడా'' పాటకు పేరడీ...

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
08:21 AM

తగ్గిన బంగారం ధరలు..

08:15 AM

జులై 17వరకు కరోనా ఆంక్షల అమలు

07:41 AM

అమెజాన్ ప్రైమ్‌లో విజయ్ 'మాస్ట‌ర్'..!

07:13 AM

తిరుమలలో పెరిగిన రద్దీ

07:11 AM

అఖిలప్రియతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు

06:54 AM

ఫాక్లాండ్ దీవుల్లో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదు

09:55 PM

మోడీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారు : రాహుల్ గాంధీ

09:30 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09:15 PM

మహిళను వదలని కరోనా..

08:49 PM

స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్ట‌ర్.. అంతా ఒక్కసారిగా షాక్

08:26 PM

లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎయిమ్స్ కు తరలింపు

08:18 PM

రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

08:09 PM

త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తాం : కేటీఆర్

08:01 PM

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలి

07:58 PM

మొబైల్ ఫోన్ ల ద్వారా ఓటరు గుర్తింపు కార్డుల డౌన్ లోడ్

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.