Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఊరంతా పండుగ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

ఊరంతా పండుగ

Sun 01 Nov 01:37:57.80143 2020

రామాపురం ఓ మారుమూలకు గ్రామం, అభివద్ధికి ఆమడ దూరం. అనేక అసౌకర్యాలు ఆ ఊరిలో తిష్ట వేసుకు ఉన్నాయి. ఎన్నికల్లో నాయకులు వచ్చి మాయమాటలు చెప్పి వెళ్లేవారు. రాత్రికి రాత్రి ఓటుకు ఐదు వందలు పంచి మళ్ళీ ఆ గ్రామంలోకి వచ్చే వారు కాదు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇదే తంతు. ఈసారి నాయకులు చెప్పే మాటలు విని తలలు ఆడించారు అమాయక ప్రజలు.
''మీ సమస్యలు అన్ని తీరుస్తాం''. ఎప్పటిలాగే ఈ సారీ మీ ఊరులోని ఓట్లు మా పార్టీకే పడాలి అన్నారు. అమాయకంగా తలలూ ఊపారు ప్రజలు.
ఆ యేడు డిగ్రీ పూర్తి చేసుకుని ఊరులోకి అడుగు పెట్టాడు కిషోర్‌. ఆ ఉరి మొత్తానికి అతనొక్కడే చదువుకున్నవాడు. ఊరిలో తిష్ట వేసుకున్న సమస్యలు గురించి తెలుసుకున్నాడు. ఎన్నికల నాయకులు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టించి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారో, ప్రజలు ఎలా నష్టపోతున్నారో అర్థం చేసుకున్నాడు. ఆ డబ్బు ఆ రోజు వారికి ఉపశమనం కలిగించవచ్చు కానీ తరువాత కాలంలో వారెలా నష్ట పోయేది వివరించి, వారిలో చైతన్యం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాడు.
మరుసటి రోజు ఆ ఊరి ప్రజలను రచ్చబండ దగ్గర సమావేశ పరచి ఇలా చెప్పాడు. ''ప్రజలారా! మనం డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నాం. దానితో నాయకులు మన ఊరి సమస్యలను పట్టించుకోవడం లేదు. వారి డబ్బు మనకు ఒక్క రోజులోనే ఖర్చు అయిపోతుంది. డబ్బు తీసుకోవడము నేరం. మన సమస్యలు పరిష్కరించాలంటే రేపు జరిగే ఎన్నికలలో ఎవరూ పోలింగ్‌ కేంద్రాలకు వెళ్ళకుండా మీమీ ఇళ్ళలోనే ఉండండి. ఒక్క ఓటు కూడా ఏ పార్టీకి ఎవరూ వేయకూడదు. మన నిరశన సెగ వారి కళ్ళు తెరిపించాలి సరేనా!'' అన్నాడు. అందరూ సరేనని మాట ఇచ్చారు.
ఎన్నికల రోజు పోలింగ్‌ కేంద్రము ఖాళీ. ఒక్క ఓటు కూడా పోల్‌ కాలేదు. ప్రజల చైతన్యం చూసి అధికారులు ఆశ్చర్య పోయారు. ఒక్క ఓటు కూడా పోల్‌ కాని రామాపురం గ్రామమని పత్రికలలో ప్రముఖంగా ప్రకటించారు.
ఎన్నికల ఫలితాలలో ఇరు పార్టీ అభ్యర్థులకు సరిసమాన ఓట్లు రావడ ముతో ఆ గ్రామ ఓట్లు కీలకమయ్యాయి. అయితే గ్రామ ప్రజలు ఓట్లు బహిష్కరణతో ఆ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించలేదు. అలానే రోజులు గడిచాయి. మళ్ళీ ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు రావడంతో ప్రతి పార్టీ వాళ్ళు ఆ గ్రామానికి రావడము మొదలు పెట్టారు. ఆఘమేఘాలపై ఇరుపార్టీల వారు ఆ ఊరికి అన్ని సౌకర్యాలు కల్పించారు.
ఆ ఊరి రూపు రేఖలే మారిపోయాయి. అన్ని సౌకర్యాలు ఉండటంతో కిషోర్‌ ఆ ఉరి ప్రజలతో ఇలా అన్నాడు ''చూశారా మన నిరశన ఫలితం. మీలో చైతన్యం వచ్చింది. ఈ విధముగా మనం ఐక్యతతో ఉంటే నాయకులకు కూడా తమ తప్పు తెలుస్తుంది. మీరు చైతన్యం పొందడమే కాకుండా, నాయకుల్లో కూడా చైతన్యం తెచ్చారు. ఈరోజు మనకు పండుగ. ఊరంతా పండుగ జరుపుకుందాం,'' అన్నాడు. ఊరి ప్రజలందరూ ఉగాదికి ముందే మాకు పండుగ వచ్చిందని ఆరోజే సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు.
- కనుమ ఎల్లారెడ్డి, 93915 23027

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఊరుకోవే...
కరుణించిన కిరణం
పల్లెటూరు టూరు
తాగే నీళ్ళు
రాజు గారి సందేహం
టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా..
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
కార్తీక్‌
నేను తిన నీకు బెట్ట
పోచమ్మ చెరువు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:07 PM

హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి

09:55 PM

సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..

09:38 PM

మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత

09:13 PM

తెలంగాణ మందు బాబులకి శుభవార్త..

08:59 PM

అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల

08:46 PM

ఏపీలో 56 పాజిటివ్ కేసులు

08:10 PM

తెలంగాణ సీఐ సృజన్‌రెడ్డికి రాష్ట్రపతి అవార్డు

07:47 PM

వాహనం బోల్తా.. 12 మందికి గాయాలు

07:31 PM

టిక్ టాక్ స్టార్ రఫీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్

07:14 PM

రేపు ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో సెమినార్

07:08 PM

మైనర్‌పై బ్యాంక్‌ మేనేజర్‌ లైంగికదాడి

06:49 PM

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు రైతుల పాదయాత్ర

06:09 PM

100, 10, 5 నోట్ల ర‌ద్దు‌పై స్పందించిన‌ ఆర్బీఐ

06:08 PM

రైతుల నుండి బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలి..

05:57 PM

కరోనా టీకాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : కేంద్రం

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.