Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆడవాళ్ళు - పోరాటం | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • అంతరంగం
  • ➲
  • స్టోరి

ఆడవాళ్ళు - పోరాటం

Sun 17 Jan 01:02:03.156138 2021

ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధులు రైతులు చేస్తున్న నిరసన దీక్షల్లో పాల్గొనరాదని సాక్షాత్తు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించారు. ఎందుకంటే మిగతావాళ్ళకంటే వాళ్ళు బలహీనులని, కష్టాలను, సవాళ్ళను ఎదుర్కోలేరని అందులోని భావన. సమాజంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు వుంటుంది. మన రాజ్యాంగం ప్రకారమూ ఆడామగా తేడా లేకుండా అందరూ సమానమనే భావననే తెలుపుతుంది. ఆడవాళ్ళు అబలలనే అభిప్రాయంలోంచి ఈ సూచన వచ్చిందని, ఇది మహిళల సమాన హక్కుల పట్ల వివక్షా పూరిత ఆలోచన అని చర్చ జరుగుతోంది.
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో గత రెండు నెలలుగా జరుగుతున్న ఆందోళనలలో మహిళా రైతులూ పాల్గొంటున్నారు. రైతనగానే పురుషుణ్ణి ఊహించుకుంటాము. కానీ సమ పాళ్ళలో వ్యవసాయ రంగంలో మహిళలూ పని చేస్తూన్నారు. ఇండ్లళ్ళో ఉండే మహిళలు కూడా ఉద్యమానికి వెన్నుదన్నుగా వుంటూ, వారి జీవితాలకే ముప్పు తెచ్చే చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాడాల్సిందేనని మద్దతునూ సంపూర్ణంగా తెలుపుతున్నారు. కొందరు ప్రత్యక్షంగానే పాల్గొంటున్నారు.
అయితే అన్ని సవాళ్ళను తట్టుకొని పోరాడగల శక్తిసామర్థ్యాలు మహిళలకు లేవా! లేవనే భావనే న్యాయమూర్తి పిలుపులో కనపడుతోంది. ఏదో దయతో కరుణతో అన్నట్టుగా ఆ మాటలు వున్నప్పటికీ సారాంశంగా మహిళలు బలహీనులనే స్థిర అభిప్రాయం వెల్లడయింది. ఇది అంత పెద్ద స్థానంలో వున్న వ్యక్తికి ఉండాల్సిన అభిప్రాయం కాదు. సామాజిక పరిణామ చరిత్ర తెలియని వారి అభిప్రాయంగానే దాన్ని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మాతృస్వామిక వ్యవస్థలో స్త్రీయే సమాజ గమనానికి కీలకమైన వ్యక్తిగా ముందుండి కృషి చేసింది. ఆహారపు పంటల ఉత్పత్తికి ఆధ్యురాలూ మహిళనే. ఇక చరిత్రను గమనిస్తే వీరోచిత పోరాటాల చేసిన ధీర వనితలు ఎందరో మన ముందు నిలుస్తారు. రాజ్యాలు ఏలిన వాళ్ళూ మంత్రులుగా, సైన్యాధికారులుగా, శ్రామికులుగా, శాస్త్రవేత్తలుగా, కళాకారులుగా, పండితులుగా ఎందరినో ఉదహరించవచ్చు. ఇప్పటికీ ప్రతి ఇంటిలో నిత్య పోరాటశీలురుగా, శ్రమైక ధీరులుగా ఆడవాళ్ళు వున్నారు.
ఎంతో మంది వీరులకు, ధీరులను తీర్చిదిద్దిన వాళ్ళు కూడా మహిళలే అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి. మన స్వాతంత్య్ర పోరాటంలోనూ మహిళలు ఎంతో మంది పాల్గొని ప్రాణాలర్పించారు. అందుకు ఉదాహరణే ఝాన్సీలక్ష్మీబాయి, కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌, సుభాష్‌ చంద్రబోస్‌ ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌లో సైన్యాధికారిగా పని చేసిన చరిత్ర మనకళ్ళ ముందుంది. ఎన్ని సవాళ్ళనో ఎదిరించి ధైర్యంగా, సాహసంతో ఈ దేశంలో మొట్టమొదట ఆడపిల్లలకు చదువు నేర్పిన ఉపాధ్యాయురాలు సావిత్రిబాయిఫూలేను మొన్ననే గుర్తు చేసుకున్నాము. వీరనారి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని పోరాడిన చాకలి ఐలమ్మ మన నేల చరిత. ఇలా ఎందరినైనా వివరిస్తూ పోవచ్చు.
స్త్రీకి పురిటినొప్పే ఓ పెద్ద పోరాటం. సమస్త మానవాళికి ప్రాణం పోస్తున్న బలవంతురాలు స్రీ. నిత్య ఆచరణ శీలి, శ్రామిక జీవి. అందుకనే వాస్తవిక జ్ఞానము, సామర్థ్యము, అవగాహన, ధైర్యము మహిళల సొంతం. అలాంటి వారిని తరతరాలుగా వంట ఇంటికి పరిమితం చేసి, పిల్లలు కనే యంత్రంలా మార్చి, బానిసలా చూస్తున్న సమాజంలోని ఆధిపత్య భావజాలాన్ని జీర్ణించుకున్న వ్యక్తులే స్త్రీని అబల అని భావిస్తారు. ఈ ఆలోచనలు మతతత్వం గల వారికి మరీ అధికం. బహిరంగంగానే, ఆడవాళ్ళు ఇంటి పనులకే పరిమితం కావాలని, పిల్లలను పెంచటమే వారి బాధ్యత అని సంఘ్ పరివార్‌ నాయకులు చెబుతున్నారు. ఇదంతా తిరోగమన భావాల పరంపర. సమాజంలోని సగం మందిని తమ గుప్పిటలో ఆధిపత్యంలో ఉంచుకోవాలనే పురుషాధిక్య అహంకారం తప్ప వేరుకాదు.
ఆధునిక సమాజంలో అందరూ సమానమనే ఆలోచనతో ముందుకు పోవాలి తప్ప, ఇలాంటి వెనుకబాటు భావాలు పనికిరానివి. వీటిని తిప్పి కొట్టాల్సిన అవసరం కూడా వుంది. మతతత్వ శక్తులు పెరుగుతున్న తరుణంలో ఈ రకమైన బేధాలను, అసమానతలు పెరుగుతాయి. అందుకనే మత మూఢత్వంపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సిగ్గు
ఆందోళన
ప్రేమికులు - ప్రేమలు
కీలుబొమ్మలు
మూఢత్వం
పెండ్లిళ్ళ పెత్తనాలు
యిరుగు పొరుగు
నెమరు
స్వాగతం
యువత రావాలి

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
05:22 PM

దేశంలో ఒక్క‌రోజే 15 లక్ష‌ల మందికి టీకాలు

05:18 PM

100 కోట్ల క్లబ్బులో 'ఉప్పెన'..

05:01 PM

ఆర్టీసీ బస్సులు ఢీ.. ఐదుగురి మృతి

04:33 PM

శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' టైటిల్ పోస్టర్ రిలీజ్

04:31 PM

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్

04:24 PM

మరో యువకుడి చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ.. వీడియో వైరల్

04:13 PM

భారత్ ఘన విజయం..టెస్టు సిరీస్ కైవసం

04:08 PM

గోల్నాకలో విషాదం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

04:02 PM

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం..

03:55 PM

ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 ప్రారంభం

03:45 PM

బీడీ కార్మికుల ధర్నా

03:27 PM

బాలుడిని మింగెసిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు (వీడియో)

02:58 PM

కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత

02:44 PM

విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్..

02:10 PM

కేటీఆర్ పీఏనంటూ మోసాలు..మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.