Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఇమ్రాన్‌పై ట్వీట్ల దాడి చేసిన వర్మ..
  • రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..
  • నేడు విడుదల కానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌..
  • మల్టీప్లెక్స్‌ల వైపు అధికారుల చూపు..
  • గోల్కొండ కోటను సందర్శించిన అమెరికా బృందం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
మ‌రుగు దొడ్లు | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Jun 21,2015

మ‌రుగు దొడ్లు

- నిర్మాణాల్లో ఆలస్యం
- ఈ ఏడాదీ విద్యార్థులకు తప్పని తిప్పలు
- ఒక్కటీ పూర్తికాని పరిస్థితి
- హడావుడి పనులతో నాణ్యతాలోపం
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రతినిధి
పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలని ఎనిమిదేళ్ల క్రితమే సుప్రీం కోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ మరుగుదొడ్ల నిర్మాణాల్లో శ్రద్ధ చూపలేదు. కొన్ని పాఠశాలల్లో నామమాత్రంగా పనులు చేపట్టినా ఇప్పటికీ పూర్తికాని పరిస్థితి. ఈ సమస్యతోనే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకే రాలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ వరకు పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మిస్తామని చెప్పింది. కాని జిల్లాలో ఎక్కడా మరుగుదొడ్లు పూర్తి కాలేదు. ఈ నెల చివరి వరకైనా అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి నివేదిక పంపించాలని ఇటీవల ప్రభుత్వం కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్‌ సైతం ఆర్‌విఎం, ఇంజనీరింగ్‌, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు హడావుడిగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వల్ల పనుల్లో నాణ్యత లోపిస్తుందని పలువురు పేర్కొంటున్నారు.
ఒక్కటీ పూర్తికాని మరుగుదొడ్డి
స్వచ్ఛభారత్‌లో భాగంగా స్వచ్ఛ పాఠశాల పేరుతో పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో సర్వశిక్షాభియాన్‌ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.39 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలో 2646 కొత్తగా, 1206 మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు ఏప్రిల్‌లో ప్రారంభించి జూన్‌ 15 నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఒక్కటి కూడా పూర్తి కాలేదు. కొత్తగా చేపట్టిన ఒక్కో మరుగుదొడ్డికి రూ.1.25లక్షలు కేటాయించారు. మంజూరైన నిధుల్లో నుండి 50శాతం అంటే జిల్లాకు సుమారు రూ.19.50కోట్ల నిధులను ముందుగానే పాఠశాలల యాజమాన్య కమిటీలకు అధికారులు విడుదల చేశారు. ఈ కమిటీలు సూచించిన వారే పనులు చేపట్టాల్సి ఉంది. ఏప్రిల్‌లో నిధులు మంజూరైతే, మే నెలలో పనులు ప్రారంభించారు. వేసవి కాలం కావడం వల్ల జిల్లాలో పనులు చేపట్టిన చోట్ల నీరు లేక, మెటీరియల్‌ దొరక్క, కూలీలు అందుబాటులో లేక పనులు నత్తనడకన సాగాయి. పనులు పాఠశాల యాజమాన్య కమిటీలకు అప్పగించడంతో ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించారు. రాజకీయ జోక్యం పెరిగింది. దీంతో పనుల్లో జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాల్లో నేటికీ 150 పనులు ప్రారంభించలేదు. ప్రారంభించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. సుమారు 703 మరుగుదొడ్లు బేస్‌మెంట్‌ దశ కంటే తక్కువ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. 709 బేస్‌మెంట్‌ స్థాయిలో ఉన్నాయి. 459 లెంటల్‌ లెవల్‌లో ఉండగా, 334 మరుగుదొడ్లకు స్లాబ్‌ వేశారు.
పనుల వేగంతో నాణ్యతాలోపం
మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నెలాఖరులోగాలైనా పూర్తి చేయాలని కలెక్టర్‌కు పది రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్‌ కూడా సంబంధిత అధికారులతో సమావేశమై నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు వేగవంతంగా చేయాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచారు. దీంతో పనుల్లో నాణ్యతాలోపం కనిపిస్తుందని విమర్శలు వస్తున్నాయి. నాణ్యమైన ఇసుక వాడాల్సి ఉండగా, నాసిరకం నల్ల ఇసుక వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. సమీప వాగుల్లోంచి అందుబాటులో ఉన్న ఇసుకను తీసుకొచ్చి వినియోగిస్తున్నారు. అంతేకాకుండా క్యూరింగ్‌ సరిగా చేయడం లేదని తెలుస్తోంది. దీని ద్వారా నిర్మాణాలు ఎక్కువ కాలం ఉండే అవకాశం లేకుండాపోతుంది. మరుగుదొడ్డి వెంటిలేషన్‌ కోసం 3 అడుగుల వెడెల్పు, 2 అడుగుల పొడవుతో ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఎక్కువ చోట్ల డబ్బులు మిగుల్చుకునేందుకు 9 ఈంచుల పొడువు, 18 ఈంచుల వెడెల్పు ఉండే వాటిని అమర్చుతున్నారు.
ఈ నెలాఖరులోగా అన్ని పూర్తి చేస్తాం: విజరుకుమార్‌, ఆర్‌విఎం పిఓ
మరుగుదొడ్ల నిర్మాణాలు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశాలున్నాయి. ఇప్పటి వరకు పూర్తికాని నిర్మాణాలను నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 2646 మరుగుదొడ్ల పనుల్లో 150 పనులు మొదలు పెట్టలేదు. మొదలు పెట్టిన పనుల్లో అన్ని 90శాతం పూర్తి దశలో ఉన్నాయి. పది రోజుల్లోగా మిగతావి పూర్తి చేస్తాం.

మ‌రుగు దొడ్లు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉర్రూతలూగించిన జానపదం
ఉర్రూతలూగించిన జానపదం
సంక్షేమ పథకాలలో మొదటిస్థానం
వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి
బ‌తుక‌మ్మ కానుక‌గా... చేనేత చీర‌లు
పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్‌పీ శ్రీనివాస్‌
కేసుల పూర్వపరాలను అధ్యయనం చేయాలి
గోకొండలోనే పంచాయతీ భవనం నిర్మించాలి
పకడ్బందీగా పాఠశాలల అభివృద్ధి
నేడు డయల్‌ యువర్‌ ఆర్‌ఎం
నేడు మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం
'సామూహిక సెలవు'కు మద్దతివ్వాలి
మరణిస్తున్న సబ్సిడీ గొర్రెలు ఆందోళనలో లబ్దిదారులు
ఆలోచన మంచిదే..ఆచరణే అనుమానం
అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలి
భార్యపై హత్యాయత్నానికి పాల్పడినందుకు ఐదేండ్ల జైలు
గరీబ్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ
వినాయకుడి మాజీ ఎంపీ పూజలు
సీపీఎస్‌ రద్దుకు పోరు
ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
ఉచిత శిక్షణ దరఖాస్తుల స్వీకరణ
డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లకు దరఖాస్తులు
ఉద్యోగ విరమణ పొందిన లక్ష్మణ్‌కు సన్మానం
'దేవి శ్రీకాంత్‌ కుటుంబాన్ని ఆదుకోవాలి'
రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నికలు
పీఆర్‌టీయూ మండల కార్యవర్గం ఎన్నిక
టీ-మాస్‌ ఫోరం సభను విజయవంతం చేయాలి
ప్రతి గ్రామంలో రజక కమిటీలేయాలి
జీఎస్టీతో ఫొటో ప్రింటింగ్‌ రేట్లు పెంచాం
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

08:46 AM

ఇమ్రాన్‌పై ట్వీట్ల దాడి చేసిన వర్మ..

08:41 AM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..

08:38 AM

నేడు విడుదల కానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌..

08:35 AM

మల్టీప్లెక్స్‌ల వైపు అధికారుల చూపు..

08:25 AM

గోల్కొండ కోటను సందర్శించిన అమెరికా బృందం

08:24 AM

పట్టుబడ్డ తమిళ జాలర్లు...అధికారుల చర్చలు

08:08 AM

ఈ నెల 26న అయోధ్య కేసు విచారణ..

08:06 AM

విజయవాడలో కారు బీభత్సం..

08:04 AM

నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్న మంత్రులు..

07:59 AM

7వ వేతన స్కేల్‌ అమలు కోసం వినతి పత్రం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.