Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్నూర్
మండలకేంద్రంలో మైనార్టీ కాలనీలో పారిశుధ్యం లోపిచింది. ఫలితంగా కాలనీవాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు గ్రామపంచాయతీ పట్టించుకోవడంలేదని వాపో తున్నారు. ప్రధాన రహదారి నుంచి మైనార్టీ కాలనీకి వెళ్లే దారి మొత్తం బురదమయంగా మారడంతో కాలనీకి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పతున్నారు. వర్షాలు కురుస్తున్నందున మురుగునీరు నిలిచిపోయి దోమలు, ఈగలకు అవాసంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పారిశుధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు.