Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు... | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 07,2019

ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు...

- మున్సిపాలిటీల్లో పాగా వేసే ప్రయత్నం
- ఎత్తుకు పై ఎత్తులు.. మారుతున్న సమీకరణాలు
- చేరికలతో బిజీబిజీగా పార్టీలు
నవతెలంగాణ-మంచిర్యాల

మున్సిపల్‌ ఎన్నికలకు హై కోర్టు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో తేదీలు ప్రకటించనుండగా, అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. జిల్లాలో ఎన్నికలు జరగనున్న ఆరు మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పార్టీల్లోకి వలసలను ప్రోత్సహిస్తూ చేరికలతో ఒకవైపు, వార్డుల్లో ప్రచారంలో మరోవైపు నాయకులు బిజీబిజీగా గడుపుతున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మొత్తానికి ఆరు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని అన్ని పార్టీలు ఆరాటపడుతున్నాయి.
      జిల్లాలో పాతవి, కొత్తవి కలిపి మొత్తం ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడంతో మందమర్రి పట్టణంలో ఎన్నికలు నిర్వహించకపోగా, మంచిర్యాల, బెల్లంపల్లి క్యాతన్‌పల్లి, నస్పూర్‌, లక్షెట్టిపేట, చెన్నూర్‌ ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వార్డుల విభజనకు ముందు ఈ ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 118 వార్డులు ఉండగా.. ఆ సంఖ్య ఇప్పుడు 150కి పెరిగింది. తాజా పరిస్థితులను చూస్తే మున్సిపాలిటీల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ బలంగా కనిపిస్తున్నా.. ప్రజల్లో అసంతృప్తి అనేది స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ ఎంపీ వివేక్‌ బీజేపీలో చేరడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో కాస్త ఉత్సాహం కనిపిస్తున్నా.. గెలిచే అవకాశాలు తక్కువేననే చర్చ జరుగుతోంది. అయితే గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పోటీ ఇచ్చిన కాంగ్రెస్‌ బలంగానే కనిపిస్తోంది. ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి చేరాలని ఆహ్వానాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ కూడా ఇతర పార్టీల్లోని నాయకులను పార్టీలో చేర్చుకోవాలని చూస్తుండగా, ప్రస్తుతం ఉన్న నాయకులు ఆందోళన చెందుతున్నారు. అయితే చేరికలు, మారుతున్న పరిణామాలు రానున్న ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయోననే ఆసక్తి నెలకొంది.
ఎవరి ప్రయత్నాలు వారివి..
జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉండగా, ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్‌ నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే మున్సిపాలిటీల్లో పార్టీని గెలిపించి తమ పట్టు నిలుపుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. మెజార్టీ కౌన్సిలర్‌ స్థానాల్లో గెలిచి మున్సిపాల్టీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. చేరికలతో దూకుడును పెంచారు. అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటూ మాజీ కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటిస్తున్నారు. వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వీలైనంత ఎక్కువ మందిని చేర్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా మున్సిపల్‌ చైర్మెన్‌ కోసం కూడా పోటీ ఎక్కువగానే కనిపిస్తోంది.
కాంగ్రెస్‌, బీజేపీలు కూడా..
అధికార పార్టీకి దీటుగా కాంగ్రెస్‌, బీజేపీలు కూడా పావులు కదుపుతున్నాయి. మాజీ ఎంపీ వివేక్‌ చేరికతో జిల్లాలో పట్టుపెరిగిందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున నాయకులను బీజేపీలో చేరాలని ఆహ్వానాలు పంపుతున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు. కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌తో పోల్చుకుంటే బీజేపీకి జిల్లాలో క్యాడర్‌, కార్యకర్తలు కూడా తక్కువే. మాజీ ఎంపి వివేక్‌ చేరికతో కాస్త బలం పెరిగినట్టు కనిపిస్తున్నా.. అది క్షేత్రస్థాయిలో లేదనే చర్చ జరుగుతోంది. దీంతో బీజేపీ కంటే కాంగ్రెస్సే బలంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌కు దీటుగా నిలిచింది కాంగ్రెస్‌ పార్టీయే. ఓటమిని చవిచూసిన ధైర్యాన్ని కోల్పోకుండా టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీఇచ్చేట్లు కనిపిస్తోంది. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ కాంగ్రెస్‌ జిల్లా నాయకులు ముందుకు సాగుతు న్నారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నిస్తు న్నారు. అయితే ఎన్నికలు జరిగే తేదీలు, రిజర్వేషన్ల ఖరారు తరువాతే రాజకీయాలు పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

09:55 PM

మోడీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారు : రాహుల్ గాంధీ

09:30 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09:15 PM

మహిళను వదలని కరోనా..

08:49 PM

స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్ట‌ర్.. అంతా ఒక్కసారిగా షాక్

08:26 PM

లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎయిమ్స్ కు తరలింపు

08:18 PM

రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

08:09 PM

త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తాం : కేటీఆర్

08:01 PM

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలి

07:58 PM

మొబైల్ ఫోన్ ల ద్వారా ఓటరు గుర్తింపు కార్డుల డౌన్ లోడ్

07:55 PM

ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి

07:48 PM

మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు శ్వేతామహంతి నియమకం

07:31 PM

జైలు నుంచి విడుదలైన భూమా అఖిలప్రియ

07:22 PM

తెలంగాణలో ప్రియురాలు.. దుబాయ్ లో ప్రియుడి ఆత్మహత్య

07:07 PM

చిరుతను చంపి వండుకుని తిన్నారు..

06:20 PM

5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పలేదు.. అర్వింద్.. ఎంపీపై రైతుల ఆగ్రహం

05:48 PM

సంపూర్ణేష్ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

05:43 PM

దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ : కొప్పుల ఈశ్వర్

05:40 PM

పాఠశాలల పునః ప్రారంభం మంత్రి హరీశ్ రావు సమీక్ష..

05:35 PM

ఆర్జీవీ`డీ కంపెనీ` టీజర్‌..

05:34 PM

ఎంసీహెచ్ ఆస్పత్రిలో సిబ్బందికి నియామక పత్రాలు అందజేసిన స్పీకర్

05:30 PM

జీహెచ్ఎంసీ పరోక్ష ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన నియమావళి

05:25 PM

సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో సహాయం

05:21 PM

దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుపై రేపు వెబినార్..

05:07 PM

ఇసుకను వేడి చేస్తే బంగారంగా...

05:04 PM

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన..

04:51 PM

అన్ని గ్రామాలకు నాబార్డ్​ సేవలు: సీఎస్​

04:41 PM

మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

04:30 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గిఫ్టుగా మహీంద్రా వాహనాలు..

04:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.