Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
తేమ పేరుతో సీసీఐ కొర్రీలు | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 08,2019

తేమ పేరుతో సీసీఐ కొర్రీలు

- దగా పడుతున్న పత్తి రైతు
- నామమాత్రంగా తనిఖీలు
- ప్రయివేటు వ్యాపారుల వైపు
మొగ్గుచూపుతున్న వైనం
నవతెలంగాణ- ఆసిఫాబాద్‌
సీసీఐ అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులు కుమ్మక్కై రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. తేమ శాతం 8 ఉన్నప్పటికీ నిర్ణయించిన ధర కంటే తక్కువ చెల్లింపులు చేసి తీవ్రంగా నష్టపరుస్తున్నారు. దీంతో ఆరుగాలం చమటోడ్చి పత్తి పండించిన రైతులు గిట్టుబాట ధర లభించక పుట్టెడు కష్టాల్లో కూరుకుపోతున్నారు. వీరి దిగుబడులు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు మాత్రం కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. వ్యాపారులు, అధికారుల మాయాజాలానికి అన్న దాతలు దగా పడుతున్నారు.
జిల్లాలో మొత్తం 14 సీసీఐ కేంద్రాలు
జిల్లాలో జైనూర్‌, కౌటాలలో ఒకటి చొప్పున, కొండపల్లి ఎక్స్‌రోడ్‌ వద్ద 4, ఆసిఫాబాద్‌లో 6, వాంకిడిలో రెండు మొత్తం 14 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.వీటి ద్వారా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా 26 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. వీటిలో ప్రయివేటు ద్వారా 49,265 క్వింటాళ్లు, సీసీఐ ద్వారా 77,585 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 3385 మంది రైతులు పంటను విక్రయించారు.
దగా పడుతున్న పత్తి రైతులు
జిల్లాలో పత్తి విక్రయం జోరందుకుంది. రైతులు మొదటి విడత పత్తి ఏరి సమీపంలోని సీసీఐ కేంద్రాలకు అమ్మకానికి తరలిస్తున్నారు. అయితే ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.5550లు నిర్ణయించింది. రైతులు తీసుకువచ్చే పత్తిలో ఎనిమిది శాతం తేమ మాత్రమే ఉండాలని సూచించింది. పత్తిలో తేమ పెరిగినకొద్దీ ప్రతి ఒక్క శాతానికి రూ.50 చొప్పున క్వింటాలుకు తగ్గుతుందని, 12 శాతం కంటే ఎక్కువగా తేమ ఉన్నట్లయితే పత్తి కొనుగోలు చేయకూడదని నిర్ణయించింది.దీంతో సీసీఐ కేంద్రాలకు పత్తి అమ్మకానికి తీసుకువస్తున్న రైతులు ఆ జాగ్రత్తలు పాటిస్తు న్నారు. అయినప్పటికీ నిర్వాహకులు ఏదో ఒక సాకుతో నిర్ణయించిన ధర కంటే తక్కువగా చెల్లించి సొమ్ముచేసుకుంటున్నారు. 8 శాతం తేమ ఉన్నప్పటికీ తక్కువ డబ్బులు చెల్లించడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కౌలు రైతుకు కొత్త కష్టాలు
ఇప్పటికే ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోవడంలేదు. వారికి రైతుబంధు పథకాలను వర్తింపజేయడంలేదు.దానికితోడు సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో కౌలు రైతు నోట్లో వెలక్కాయ పడ్డట్లయ్యింది. తప్పని సరిగా పట్టాపాస్‌బుక్‌ జిరాక్స్‌, బ్యాంకు అకౌంట్‌ పాస్‌బుక్‌ లాంటివి తీసుకురావాలని, అప్పుడే పంటను కొనుగోలు చేస్తామని చెప్పడంతో వారు తప్పని పరిస్థితుల్లో దళా రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించి వారు కోతలు విధించి అందినకాడికి దండుకుంటున్న పరిస్థితి నెలకొంది.
నామమాత్రంగా తనిఖీలు
సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద అధికారుల తనిఖీలు నామమాత్రంగా కొనసాగు తున్నాయి. ప్రతి సంవత్సరం మార్కెటింగ్‌ అధికారులకు ఎంతోకొంత ముడుపులు అందుతున్నాయని, అందువల్లనే వారు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తు న్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద తేమ పేరుతో నిరాకరించిన పత్తిని పక్కనే దళారులు ఉండి కొనుగోలు చేస్తున్నారని సమాచారం.ఇది అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదని విమర్శలొస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

09:55 PM

మోడీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారు : రాహుల్ గాంధీ

09:30 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09:15 PM

మహిళను వదలని కరోనా..

08:49 PM

స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్ట‌ర్.. అంతా ఒక్కసారిగా షాక్

08:26 PM

లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎయిమ్స్ కు తరలింపు

08:18 PM

రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

08:09 PM

త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తాం : కేటీఆర్

08:01 PM

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలి

07:58 PM

మొబైల్ ఫోన్ ల ద్వారా ఓటరు గుర్తింపు కార్డుల డౌన్ లోడ్

07:55 PM

ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి

07:48 PM

మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు శ్వేతామహంతి నియమకం

07:31 PM

జైలు నుంచి విడుదలైన భూమా అఖిలప్రియ

07:22 PM

తెలంగాణలో ప్రియురాలు.. దుబాయ్ లో ప్రియుడి ఆత్మహత్య

07:07 PM

చిరుతను చంపి వండుకుని తిన్నారు..

06:20 PM

5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పలేదు.. అర్వింద్.. ఎంపీపై రైతుల ఆగ్రహం

05:48 PM

సంపూర్ణేష్ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

05:43 PM

దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ : కొప్పుల ఈశ్వర్

05:40 PM

పాఠశాలల పునః ప్రారంభం మంత్రి హరీశ్ రావు సమీక్ష..

05:35 PM

ఆర్జీవీ`డీ కంపెనీ` టీజర్‌..

05:34 PM

ఎంసీహెచ్ ఆస్పత్రిలో సిబ్బందికి నియామక పత్రాలు అందజేసిన స్పీకర్

05:30 PM

జీహెచ్ఎంసీ పరోక్ష ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన నియమావళి

05:25 PM

సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో సహాయం

05:21 PM

దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుపై రేపు వెబినార్..

05:07 PM

ఇసుకను వేడి చేస్తే బంగారంగా...

05:04 PM

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన..

04:51 PM

అన్ని గ్రామాలకు నాబార్డ్​ సేవలు: సీఎస్​

04:41 PM

మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

04:30 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గిఫ్టుగా మహీంద్రా వాహనాలు..

04:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.