Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అంతరపంటగా..గంజాయి సాగు | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 08,2019

అంతరపంటగా..గంజాయి సాగు

నవతెలంగాణ- ఆదిలాబాద్‌టౌన్‌
అంతర్జాతీయ మార్కెట్‌లో క్వింటాలు గంజాయి ధర రూ.20 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. గంజాయి అక్రమ రవాణాలో ఆరితేరిన కొందరు..అటవీ ప్రాంతంలో వ్యవసాయ భూములున్న అమాయక రైతులకు డబ్బులు ఆశ చూపి గుట్టుచప్పుడు కాకుండా మొక్కలు పెంచుతున్నారు. పసుపు, మక్కతోపాటు ఇతర పంటల్లో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. అనంతరం పంట చేతికి రాగానే రహస్యంగానే దానిని ఎండబెట్టి ప్యాకింగ్‌ బ్యాగుల్లో, సూట్‌కేసుల్లో నింపి నేరుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాకు సరిహద్దున గల భోకర్‌, ధర్మాబాద్‌, నాందేడ్‌, హిమాయత్‌నగర్‌ వంటి ప్రాంతాల మీదుగా ముంబాయి వంటి ముఖ్య నగరాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు దళారులు, అక్రమార్కుల దందాలో అమాయక రైతులు బలవుతున్నారు.
ఇతర జిల్లాల నుంచి రవాణా
ఇక్కడ సాగు చేయడంతోపాటు ఇతర జిల్లాల నుంచి సైతం గంజాయి అక్ర మంగా రవాణా అవుతోంది. జిల్లా మీదుగా జాతీయ రహదారి ఉండడంతో..ఇతర జిల్లాల నుంచి మహారాష్ట్రకు జిల్లా మీదుగా తరలుతోంది. ఇప్పటికే గంజాయి సాగు చేస్తున్న వ్యవసాయక్షేత్రాలపై పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు తరచూ దాడులు నిర్వహిస్తున్నారు. గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైంది.వాహనాల తనిఖీల్లోనూ గంజాయి సైతం పట్టుబడుతోంది. గంజాయి సాగు, రవాణాకు సంబంధించి సమాచారం తెలి సిన వెంటనే దాడులు చేసి..ధ్వంసం చేయడంతోపాటు తగుల బెడుతున్నారు.
కోట్లకు పడగలు
ఏజెన్సీ ప్రాంతాలైన బోథ్‌, ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్‌, బజార్‌హత్నూర్‌ మండలాల్లో ఈ గంజాయి సాగు జోరుగా సాగుతోంది. రైతులతో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేయిస్తున్న ముఠాలు, కిలోకు వెయ్యి చొప్పున సేకరించి, బహిరంగ మార్కెట్లో కేజీ రూ.5 వేల నుంచి 6 వేలకుపైగా విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. దళారులు వాటిని 10, 15 గ్రాముల ప్యాకెట్లుగా మార్చి రూ.300 నుంచి రూ.500 వరకు అమ్ముతున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో రైతులకు మిగిలేది అంతంత మాత్రమేకాగా దళారులు కోట్లకు పడగెత్తుతున్నారు.
ఇవే ఉదాహరణలు
ఇటీవల విశాఖ పట్టణం నుంచి కొనుగోలు చేసిన తీసుకొస్తున్న గంజాయిని పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. రూ.14 లక్షల విలువ చేసే 70 (140 కిలోలు) ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.బజార్‌హత్నూర్‌ మండలానికి 12 కిలో మీటర్ల దూరంలో మోర్కండి, ఇందిరానగర్‌ గ్రామశివారు ప్రాంతాల్లోని భూముల్లో పెద్దఎత్తున గంజాయి సాగు చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు స్వయంగా ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణు వారియర్‌ నేతృత్వంలో దాడులు చేసి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.వీటి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

09:55 PM

మోడీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారు : రాహుల్ గాంధీ

09:30 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09:15 PM

మహిళను వదలని కరోనా..

08:49 PM

స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్ట‌ర్.. అంతా ఒక్కసారిగా షాక్

08:26 PM

లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎయిమ్స్ కు తరలింపు

08:18 PM

రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

08:09 PM

త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తాం : కేటీఆర్

08:01 PM

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలి

07:58 PM

మొబైల్ ఫోన్ ల ద్వారా ఓటరు గుర్తింపు కార్డుల డౌన్ లోడ్

07:55 PM

ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి

07:48 PM

మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు శ్వేతామహంతి నియమకం

07:31 PM

జైలు నుంచి విడుదలైన భూమా అఖిలప్రియ

07:22 PM

తెలంగాణలో ప్రియురాలు.. దుబాయ్ లో ప్రియుడి ఆత్మహత్య

07:07 PM

చిరుతను చంపి వండుకుని తిన్నారు..

06:20 PM

5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పలేదు.. అర్వింద్.. ఎంపీపై రైతుల ఆగ్రహం

05:48 PM

సంపూర్ణేష్ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

05:43 PM

దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ : కొప్పుల ఈశ్వర్

05:40 PM

పాఠశాలల పునః ప్రారంభం మంత్రి హరీశ్ రావు సమీక్ష..

05:35 PM

ఆర్జీవీ`డీ కంపెనీ` టీజర్‌..

05:34 PM

ఎంసీహెచ్ ఆస్పత్రిలో సిబ్బందికి నియామక పత్రాలు అందజేసిన స్పీకర్

05:30 PM

జీహెచ్ఎంసీ పరోక్ష ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన నియమావళి

05:25 PM

సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో సహాయం

05:21 PM

దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుపై రేపు వెబినార్..

05:07 PM

ఇసుకను వేడి చేస్తే బంగారంగా...

05:04 PM

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన..

04:51 PM

అన్ని గ్రామాలకు నాబార్డ్​ సేవలు: సీఎస్​

04:41 PM

మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

04:30 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గిఫ్టుగా మహీంద్రా వాహనాలు..

04:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.