- యూత్ కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ అధ్యక్షుడు నాందేడ్ చిన్ను
- బుధవార్పేట్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
నవతెలంగాణ-నిర్మల్ టౌన్
పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని యూత్ కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ అధ్యక్షుడు నాందేడ్ చిన్ను అన్నారు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో దినసరి కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రన్నారు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం పట్టణంలోని బుధవార్ పేట్ కాలనీలో నివాసముంటున్న నిరుపేదలకు బియ్యం, పప్పు, చక్కెర, మంచి నూనె, ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా నాందేడ్ చిన్ను మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల రోజువారీ కూలీలకు పూట గడవని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకోవడం సామాజిక బాధ్యతవుతుందని తెలిపారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సభ్యులు రాజేందర్, రవి, టింకు, అక్షిత్, అభి ఉన్నారు.
వలస కూలీలకు బియ్యం పంపిణీ
బోథ్ : మండలంలోని సారేర గ్రామంలో సోమవారం సర్పంచ్ ధరావత్ మీరాబాయి ఆధ్వర్యంలో ఆమె కుమారుడు టీఆర్ఎస్ మండల నాయకుడు ధరావత్ రమేశ్ మహారాష్ట్ర నుంచి వచ్చిన ముగ్గురు కూలీలకు ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం రూ.12 వందలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలను ఆదుకున్నట్టు తెలిపారు. ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తన వంతు సహకారం అందించినట్టు తెలిపారు. ఉప సర్పంచ్ భిక్కులల్ వార్డు సభ్యులు, శ్రీనివాస్ అడె నివాస్, నాయకులు జాదవ్, అంబరావు రాథోడ్ పండిత్ భారత్ ఉన్నారు.
నిరుపేదలకు అండగా దాతలు
భీంపూర్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్తో నిరుపేదలు ఉపాధి లేక అల్లాడుతున్నారు. వంట సరుకులందిస్తూ అలాంటి వారిని ఆదుకోవడంలో మండలంలోని యువకులు ముందుంటున్నారు. ఆయా గ్రామాల్లో కూలినాలి చేసుకునే పేద కుటుంబాలు రోడ్డున పడకుండా ఆయా గ్రామాల యువత వారికి అన్ని సౌకర్యాలనూ కల్పిస్తోంది. ప్రతి గ్రామంలో తమ గ్రామాలకు రాకపోకలు జరగకుండా రహదారులకు కంచెలు ఏర్పాటు చేసుకుని 24 గంటలు యువకులు గస్తీ కాస్తున్నారు. అత్యవసరమైతే తప్ప గ్రామాల నుంచి ఎవరినీ బయటకు వెళ్లనివ్వడం లేదు.
జన్నారం : ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలోని యువకుడు పెరుగు మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ దర్శనాల వెంకటస్వామి చేతుల మీదుగా 20 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ పేదలకు తోచిన సాయం చేయడం పట్ల గ్రామ యువకులను అభినందించారు. పేదవారికి సాయం చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. దాతలెవరైనా ఉంటే పేదలకు సాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పెరుగు తిరుపతి, పెరుగు శంకర్, అవ్వ రేగుంట ప్రదీప్, జాడి వెంకట్, మహేశ్, రాజు, మల్లేశ్, జలంధర్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట : వలస కూలీల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేసి ఇద్దరు కానిస్టేబుళ్లు పి రాజేందర్, సుభాశ్లు తమ ఉదారతను చాటుకు న్నారు. పట్టణంలోని ఆంధ్రాబోర్ కాలనీలో ఉన్న వలస కార్మికులు లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక దయనీయ పరిస్థితుల్లో ఉండగా పోలీసులు మేమున్నామని భరోసా ఇచ్చారు. ఆ కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి సాయం చేస్తున్న పట్టణ కానిస్టేబుళ్లను పలువురు అభినందించారు.
కాసిపేట : బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు ఓసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి కాసిపేటకి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే అరిడేపల్లి గ్రామంలోని పేద గిరిజన 50 ఇండ్లకు నిత్యావసర సరుకులను సోమవారం పంపిణీ చేశారు. జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రం రావు మాట్లాడుతూ కరోనా భారీ నుంచి తప్పించుకోవడానికి లాక్డౌన్ ఒక్కటే మార్గమని తెలిపారు. సర్పంచు శంకర్, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ బొల్లు రమణ రెడ్డి, పెద్దనపల్లి ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, దేవాపూర్ ఎంపీటీసీ అట్ట పెల్లి శ్రీనివాస్, భూక్యా రాంచందర్ణ్, రొడ్డ రమేశ్, భూంరెడ్డి, రాజీరెడ్డి, పోషమల్లు, అనంతరావు ఉన్నారు.
మహిళల తరంగిని సేవా సంస్థ ఆధ్వర్యంలో రేషన్, కూరగాయలు పంపిణీ
కాసిపేట : మండలంలోని వెంకటాపూర్, సోనాపూర్, గట్రావ్పల్లి గిరిజన గ్రామాల్లో పేద గిరిజనులకు మంచిర్యాల మహిళా తరంగిని సేవాసంస్థ ఆధ్వర్యంలో సోమవారం రేషన్, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భూమేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వం లాక్డౌన్ నిర్వహిస్తున్న సమయంలో పేదలకు సేవలందిస్తున్న మహిళా తరంగిని సభ్యులను అభినందించారు. తరంగిని సభ్యులు డాక్టర్ అన్నపూర్ణ, జ్యోష్ణ, భాగ్యలక్ష్మి ఉన్నారు.
Authorization