Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అంపశయ్యపై భారత ఆర్థిక వ్యవస్థ! | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 15,2019

అంపశయ్యపై భారత ఆర్థిక వ్యవస్థ!

- రుణాల లభ్యతపై ట్విన్‌ బ్యాలెన్స్‌షిట్‌ ప్రభావం..!
- ఎన్‌బీఎఫ్‌సీ రుణాలతో బ్యాంకులకు చిక్కులు
- వ్యవస్థలో కొత్త రుణాలు గగనంగా మారాయి..
- దీంతో ఆర్థిక వ్యవస్థ రుగ్మత మరింత పెరిగింది : మాజీ సీఈఏ అరవింద్‌ సుబ్రహ్మణియన్‌ విశ్లేషణ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయికి చేరుకుందని మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణియన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ద్వంద్వ బ్యాలెన్స్‌షీట్‌ విధానపు రెండో దశ ప్రభావాన్ని భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనుభవిస్తోందని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం 'మహా మందగమనం' పరిస్థితులు నెలకొన్ని ఉన్నాయని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వం వెలువరిస్తున్న గణాంకాలను విశ్లేషించి చూస్తే దేశంలో సాధారణ మందగమన పరిస్థితులు కాకుండా 'మహా మందగమనం' పరిస్థితులు నెలకొని ఉన్న సంగతి సుస్పష్టమవుతోందని ఆయన అన్నారు. తీవ్ర ప్రతికూలతల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ 'అంపశయ్య' పైకి సాగుతోందని ఆయన అభివర్ణించారు. హార్వార్డ్‌ విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌లో ఆయన సమర్పించి ఒక ముసాయిదా పరిశోధన పత్రంలో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనేక ఆందోళనకర పరిస్థితులను ఆయన స్పృశించారు. 2014 డిసెంబరుకు ముందు దేశంలోని ప్రయివేటు కార్పొరేట్‌ సంస్థలు తీసుకున్న రుణాలు నిరర్థక ఆస్తులుగా మారాయని ఇది ట్విన్‌బ్యాలెన్స్‌షీట్‌ సమస్యగా (టీబీఎస్‌గా) ఆయన అభివర్ణించారు. 2004-11 మధ్య కాలంలో పెట్టుబడుల బూమ్‌ ఉన్నప్పుడు బ్యాంక్‌లు ఉక్కు, విద్యుత్తు, మౌలిక రంగంలోని సంస్థలకు ఇచ్చిన రుణాలు క్రమంగా ప్రస్తుతం మొండి బాకీలుగా మారుతున్నాయని ఆయన అన్నారు. దీనిని ఆయన టీబీఎస్‌ తొలి దశగా (టీబీఎస్‌-1) వర్ణించారు. కేంద్రంలోని మోడీ సర్కారు చేపట్టిన పెద్దనోట్ల రద్దు తరువాత కాలంలో బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), స్థిరాస్తి సంస్థల రుణాలు భారీగా మొండి బాకీలుగా మారుతున్నాయని ఆయన వివరించారు. దీనిని టీబీఎస్‌ రెండో దశగా (టీబీఎస్‌-2) ఆయన అభివర్ణించారు. నోట్ల రద్దు తరువాత అత్యధికంగా ప్రజలు తమ సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారని ఆయన అన్నారు. ఇలా వచ్చిన సొమ్ములో అత్యధిక మొత్తాన్ని బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు రుణాలుగా అందించాయని ఆయన అన్నారు. ఆయా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు తమ సొమ్ములో అత్యధిక మొత్తాన్ని స్థిరాస్తి రంగానికి రుణాలు అందించినట్టుగా ఆయన తెలిపారు. ఇప్పుడు స్థిరాస్తి రంగం డిమాండ్‌ లేక అనేక ప్రాజెక్టులు ఆగిపోయి కునారిల్లుతోందని అరవింద్‌ వివరించారు. 2017-18 నాటికి పరిస్థితిని విశ్లేషించి చూస్తే స్థిరాస్తి రంగంలో నిలిచిపోయిన మొత్తం రూ.5,00,000 మొండి బాకీలలో సగం ఎన్‌బీఎఫ్‌సీలు సంబంధించినవే ఉన్నట్టుగా ఆయన వివరించారు.
ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ పతనంతో ప్రమాదం మొదలు..
గత ఏడాది సెప్టెంబరు నెలలో దేశంలోని ప్రముఖ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ పతనం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక భారీ కుదుపు అని ఆయన అన్నారు. ఈ సంస్థలో దాదాపు రూ.90,000 కోట్ల మేర మౌలిక రంగ రుణాలు సమస్యల్లో చిక్కుకున్నాయని ఆయన వివరించారు. దీంతో ఈ సంస్థతో పాటు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంస్థకు నిధులను సమకూర్చిన రుణ దాత సంస్థలు కూడా ప్రమాదంలో పడిపోయినట్టుగా మాజీ సీఈఏ తెలిపారు. ఈ కుదుపుతో దేశంలోని ఎన్‌బీఎఫ్‌సీ రంగం పరిస్థితిపై ఆందోళనలు మొదలయ్యాయని ఆయన అన్నారు. మార్కెట్లు ఎన్‌బీఎఫ్‌సీల దిద్దుబాటు చర్యలకు దిగాయని తెలిపారు.
స్థిరాస్తి రంగం కారణంగానే అస్థిరత..
ఇటీవలి కాలంలో ఎన్‌ఎబీఎఫ్‌సీ సంస్థలు అత్యధికంగా తమ రుణాలను అర్థికంగా రాణించలేకపోతున్న స్థిరాస్తి రంగానికి జారీ చేశాయని.. ఇప్పుడు ఇదే సమస్యలకు అసలు కారణంగా మారాయని ఆయన తన విశ్లేషణ పత్రంలో తెలిపారు. ఈ ఏడాది జూన్‌ ముగింపు నాటికి స్థిరాస్తి రంగం పరిస్థితిని విశ్లేషించి చూస్తే అమ్మకాలు బాగా దెబ్బతిన్న సంగతి తెలుస్తోందని అన్నారు. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో దాదాపు 10 లక్షల ఇండ్లు, వివిధ రకాల గృహాలు అమ్ముడుపోకుండా ఉన్నాయని ఆయన అన్నారు. వీటి విలువ దాదాపు రూ.8 లక్షల కోట్ల వరుకు ఉంటాయని ఆయన విశ్లేషించారు. ఈ మొత్తం పరిశ్రమ నాలుగేండ్ల అమ్మకాలకు సమానమని ఆయన వివరించారు. దీంతో బ్యాంకులు, ఎంఎఫ్‌లు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు రుణాలను జారీ చేయడం మానేశాయని.. ఇది 2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం పరిస్థితులకు కారణమైన లేమెన్‌ సంక్షోభానికి సరిసమానమైన పరిస్థితి అనివ్యాఖ్యానించారు.
బ్యాంకులపై తీవ్ర ప్రభావం..
ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల ఆర్థిక వైఫల్యం బ్యాంకులపై భారీ ప్రభావాన్ని చూపుతు న్నాయి. చాలా బ్యాంకులు తమ రుణాల జారీలో దాదాపు 10-14 శాతం అప్పులను ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు జారీ చేశాయి. ఇప్పుడు ఈ సొమ్ము మొండి బాకీల రూపంలో వ్యవస్థలో ఇరుక్కుపోవడంతో ఇప్పుడు బ్యాంకింగ్‌ సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తాజాగా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు రుణాలను అందించడం మానేశాయి. దీంతో ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల కొరత ఎర్పడింది. ఫలి తంగా స్థిరాస్తి కాకుండా ఇతర రంగాలకు చిన్న వ్యాపారాల వారికి నిధులు లభిం చడం కష్టంగా మారిపోయింది. మరోవైపు కన్జూమర్‌ డ్యూరెబుల్‌ వస్తువుల కొను గోళ్లకు కూడా ఎన్‌బీఎఫ్‌సీ అప్పులు అభించడం గగనంగా మారిందని వీరు తమ పత్రంలో విశ్లేషించారు. ఈ కారణంగా ఎన్‌బీఎఫ్‌సీల కమర్శియల్‌ క్రెడిట్‌ గత ఏడాది రూ.20 లక్షల కోట్ల గరిష్ట స్థాయి నుంచి ఈ ఏడాది తొలి అర్థ భాగంలో దాదాపు సున్నాకు చేరుకుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు.
గణాంకాలు ఆందోళనకరం..
కేంద్రంలోని మోడీ సర్కారు టీబీఎస్‌-1 వల్ల వచ్చిన సమస్యల పరిష్కారం దిశగా సరైన సమయంలో దృష్టి సారించకపోవడం, దీనికి తోడు టీబీఎస్‌-2 సమస్యల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర గడ్డు కాలం ప్రారంభమైందని మాజీ సీఈఏ తన పత్రంలో పేర్కొన్నారు. డిమాండ్‌ లేకపోవడంతో కన్జూమర్‌ గూడ్స్‌ ఉత్పత్తి దాదాపు అథమ స్థితికి చేరుకుందని, మరోవైపు పెట్టుబడి వస్తువుల ఉత్పత్తి పడిపోతోందని, ఎగుమతి-దిగుమతులు, ప్రభుత్వ ఆదాయం దాదాపు ప్రతికూల జోన్‌లోకి పడిపోయాయని సుబ్రహ్మణియన్‌ విశ్లేషించారు. ఈ గణాంకాలను బట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టిన జబ్బు మరింత తీవ్రతరమైందని చెప్పొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇది దాదాపు అంపశయ్యపైకి చేరుకున్న పరిస్థితితో సమానమని సీఈఏ విశ్లేషించారు. ప్రస్తుత పరిస్థితులు దేశంలో 1991న ఏర్పడిన ఆర్థిక చెల్లింపుల సంక్షోభపు పరిస్థితులను గుర్తుకు తెస్తున్నట్టుగా ఆయన వివరించారు.
మొండి బాకీలు మరింతగా పైపైకి.. : మూడీస్‌
బ్యాంకింగేతర విత్త సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) వల్ల బ్యాంకుల మొండి బాకీలు మరింత పెరుగొచ్చని మూడీస్‌ హెచ్చరిం చింది. ఎన్‌బీఎఫ్‌సీల్లో నెలకొన్న నగదు సమస్య కొనసాగడం వల్ల వాటికి రుణాలందించిన బ్యాంకులకు తిరిగి సకాలంలో చెల్లింపులు జరగకపోవచ్చని విశ్లేషించింది. అలాగే ఎన్‌బీఎఫ్‌సీలపై ఆధారపడిన కంపెనీల్లో కూడా నిధుల కొరత ఏర్పడి బ్యాంకులకు గడ్డు కాలంగానే ఉంటుందని పేర్కొంది. వీటి రుణ వసూళ్ల రికవరీ చాలా నెమ్మదిగా ఉందని తెలిపింది. సూక్ష్మంగా విశ్లేషిస్తే ఎన్‌బీ ఎఫ్‌సీల నుంచి కంపెనీలకు, కంపెనీల నుంచి బ్యాంకులకు ఒత్తిడి బదిలీ అవు తుందన్నారు. ఫలితంగా బ్యాంకుల ఆస్తుల నాణ్యత, లాభదాయకత, మూల ధనం అన్నీ దెబ్బతిని వాటి రేటింగ్‌లపై ప్రభావం పడుతుందని తెలిపింది. 2018లో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం ఏర్పడిన నాటి నుంచి ఈ విత్త సంస్థలు నగదు లభ్యత సమస్యను తీవ్రంగా ఎదుర్కొం టున్న విషయం తెలిసిందే. మూడీస్‌ విశ్లేషణ ప్రకారం.. ఎన్‌బీఎఫ్‌సీ రంగం అత్యధికంగా రియల్‌ ఎస్టేట్‌కు ఇచ్చిన రుణాలు ఒత్తిడిలో ఉండటంతో ఆ ప్రభావం బ్యాంకులపై పడింది. ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులపై రిస్కు పెరగడంతో నిధుల సమీకరణ సవాల్‌గా మారింది. ఇది బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలు ఎన్‌బీఎఫ్‌సీపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయని సీనియర్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌ వడ్లమని పేర్కొన్నారు. దీంతో బ్యాంకుల్లో మొండి బాకీల పెరుగుదలకు కారణం కానున్నాయన్నారు. ముఖ్యంగా భారీగా అప్పులు పొందిన రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎన్‌బీఎఫ్‌సీలపై ఒత్తిడిని పెంచుతుందని మూడీస్‌ పేర్కొంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బిట్‌ కాయిన్‌ ఓ బుడగ
నిమిషానికి రూ.575 కోట్ల నష్టం
రికార్డ్‌ కనిష్టానికి వాహన అమ్మకాలు
ఐటీసీకి ఐసీఎస్‌ఐ అవార్డులు
బైజూస్‌ చేతికి ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌..!
క్యాపిటాల్యాండ్‌ కు బ్రిటిష్‌ సెఫ్టీ కౌన్సిల్‌ గుర్తింపు
యురేకా ఫోర్బ్స్‌ నుంచి నూతన డా.అక్వాగార్డ్‌
స్వీట్ అండ్ సినిస్టర్
ఈక్వెల్‌ పార్టనర్‌ పాలసీని ఆవిష్కరించిన ఓయో
ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ
రెవెరీ వారి అనువాదక్ 2.0 డైనమిక్ వెబ్‌సైట్‌
కోట్పా(COTPA) సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి : ఫైఫా (FAIFA)
హెచ్‌ఆర్‌హెచ్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ గ్లోబల్‌ కు దాల్మియా సిమెంట్‌ మద్దతు
నాన్‌ ఉబర్‌ ఆటోల్లో 500 సేఫ్టీ స్క్రీన్స్‌
క్యాపిటాల్యాండ్ కు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ కొవిడ్-19 అస్యూరెన్స్ అసెస్‌మెంట్
ఏపీ మహేష్‌ బ్యాంక్‌ చైర్మెన్‌గా రమేష్‌ కుమార్‌ బంగ్‌
హెరిటేజ్‌ ఫుడ్స్‌కు అవార్డులు
పటాన్‌ చెర్వులో రూ.22 కోట్లతో ప్లాంట్‌
ధరలపై ప్రాప్‌టైగర్‌ అధ్యయనం
యుఎన్‌ అకాడమీతో లింకైన గేట్‌ ఎగ్జామ్‌ ఎడ్యుకేటర్‌
శాంసంగ్ సంక్రాంతి ఆఫర్లు
ముకేష్‌ సంపదకు అమెజాన్‌ సెగ..!
రూ.2వేలు తగ్గిన బంగారం
టాప్‌ వంట నూనెల్లో 'ఫ్రీడం' బ్రాండ్‌
బీ30 నగరాల వృద్ధిపై దృష్టిసారించిన యునియన్‌ ఏఎంసీ
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,499కే
సిడ్బీతో బీఓబీ ఒప్పందం
భారత్‌లో సాప్‌ రూ.500 కోట్ల పెట్టుబడులు
తలసేమియా బాధితులకు రేలా హాస్పిటల్స్‌, కంచికామకోటి చైల్డ్స్‌ ట్రస్ట్‌ చేయూత
జీవిత బీమా ప్లాన్లను ఆవిష్కరించిన PhonePe

తాజా వార్తలు

09:00 PM

వికారాబాద్‌ జిల్లాలో బుల్లెట్‌ కలకలం

08:51 PM

మోడీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్

08:44 PM

రైతులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..

08:32 PM

జల్లికట్టు క్రీడల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి, 50మందికి గాయాలు

08:28 PM

తొలి రోజు లక్షా 91వేల మందికి కరొనా టీకా

08:04 PM

జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న అష్ట గంగాధర్

07:59 PM

డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాల విడుదల

07:53 PM

వ్యాక్సిన్ తీసుకువస్తున్న వాహనానికి డప్పులతో స్వాగతం

07:52 PM

పోలీసు కావాలనుకుంటున్నారా? అయితే దరఖాస్తు చేసుకోండి..

07:43 PM

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 200 రుణ యాప్‌లు తొలగింపు

07:31 PM

సంగారెడ్డిలో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

07:17 PM

దేశంలో 116కు చేరిన కొత్త రకం కరోనా కేసులు

07:01 PM

నేను ఇలానే ఆడతా: విమర్శలకు రోహిత్ శర్మ సమాధానం

06:36 PM

ఆర్డీవో ఆఫీసులో మల్లన్నసాగర్ బాధితుడి ఆత్మహత్యాహత్నం

06:28 PM

ఏపీలో కొత్తగా మరో 114 పాజిటివ్ కేసులు

05:49 PM

వ్యాక్సిన్ వేయించుకున్న సీరమ్‌ అధినేత

05:22 PM

'క్రాక్' హిందీ రీమేక్ లో సోనూసూద్?

05:02 PM

బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్

04:46 PM

గెలుపొందిన వారి పేర్లతో జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ..

04:37 PM

వ్యాక్సిన్ తీసుకున్న వారికి సమస్య వస్తే.. భారీ నష్ట పరిహరం, ఉచిత వైద్యం

04:25 PM

తెలంగాణ ప్రజలకు శుభవార్త..

04:01 PM

జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నాడు: చంద్రబాబు

03:23 PM

రూ.2,500 కోసం హత్యాయత్నం..

02:53 PM

వరుణుడి ఎఫెక్ట్... బ్రిస్బేన్ టెస్టులో రెండో రోజు ఆట రద్దు

02:34 PM

బోయిన్‌ప‌ల్లి కిడ్నా‌ప్ కేసులో మ‌రో ట్వి‌స్ట్...

02:22 PM

విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత..!

02:14 PM

దేశంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇతనే..

02:03 PM

ప్రధాని సూచన మేరకే టీకా తీసుకోలేదు: కేటీఆర్

01:51 PM

కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

01:24 PM

ఒంటెను ఢీకొని..ప్రఖ్యాత బైక్ రైడర్ మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.