Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పాకిస్థాన్ లో అడుగుపెట్టిన సౌదీ యువరాజు
  • ఇండియా గేట్ వద్ద అమర జవాన్లకు నివాళులు
  • జాతీయజెండాను కాళ్ళకిందేసి తొక్కిన యువకుడు
  • 10 నిమిషాల్లో రూ.17.5 లక్షల విరాళాల సేకరణ
  • పోలీసులకు చుక్కలు చూపించిన మందు బాబుపై కేసు నమోదు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
సరికొత్త సాహిత్య కేంద్రం రొట్టెమాకురేవు | దర్వాజ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Jan 22,2017

సరికొత్త సాహిత్య కేంద్రం రొట్టెమాకురేవు

కవిత్వాన్ని సృజించడమే కాదు, కవిత్వాన్ని సృజించే వారిని ప్రోత్సహించడం కవితాదీప్తికి సోపానం. ఇలాంటి సోపానాలెన్నో నిర్మించే కర్తవ్యదీక్షను కొనసాగిస్తున్నవాడు కవి యాకూబ్‌. పాతికేళ్ళ కిందట, అంటే 1992లో 'ప్రవహించే జ్ఞాపకం' ద్వారా కవితా రంగంలోకి అడుగుపెట్టిన యాకూబ్‌ నిత్య ప్రవాహశీల స్వభావంతో ప్రయాణిస్తున్నాడు. స్వయంగా కవిత్వమూ, వచనమూ రాస్తున్నాడు. కొన్నేళ్ళ కిందట లబ్ధప్రతిష్టులైన అజంతా, దేవిప్రియ, ఇస్మాయిల్‌, చేరాల సాహిత్యకృషిని ప్రపంచానికి మరింతగా తెలియజెప్పే కార్యక్రమాల్ని నిర్వహించాడు. దాదాపు అయిదేళ్ళ కిందట 'కవిసంగమం' ఆరంభించి వర్తమాన తరంలో కవితా చైతన్యాన్ని పరిపుష్టం చేసే కృషికి శ్రీకారం చుట్టాడు. తెలుగునాట కవితా సృజన కొత్త పుంతలు తొక్కడానికి యాకూబ్‌ చేసిన దోహదం విశాలమైంది. ఏకకాలంలో సాహిత్యకారునిగా, కార్యకర్తగా, ఉద్యమశీలిగా తన కార్యరంగాన్ని విస్తృతం చేసుకుంటూ తెలుగు సాహిత్య ప్రపంచం మీద తనదైన ముద్రవేశాడు యాకూబ్‌.
ఈవిధమైన కృషిలో భాగంగా రెండేళ్ళ కిందట స్వగ్రామమైన రొట్టమాకు రేవు (ఖమ్మంజిల్లా)లో కె.యల్‌.నర్సింహారావు పేరిట గ్రంథాలయాన్ని నిర్మించి దాన్నొక సాహిత్య, సాంస్కృతిక కేంద్రంగా మలిచే ప్రయత్నం చేయడం చెప్పుకోదగ్గ విశేషం. అంతేగాక 'రొట్టమాకు రేవు కవిత్వ అవార్డు' పేరిట ప్రతి యేటా ముగ్గురు కవులకు అవార్డులు ఇవ్వడం గమనార్హం. ప్రతి సంవత్సరం అక్టోబరు 10న ''షేక్‌ మహమ్మద్‌ మియా, కె.ఎల్‌. నరసింహారావు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక కవితా పురస్కారం'' ను గుదిగుచ్చి ''రొట్టమాకురేవు కవిత్వ అవార్డు''గా ఇవ్వడం, ఒక ఊరి పేరుతో అవార్డు నెలకొల్పడం ద్వారా పల్లెలు, స్థానికత అనే అంశాలకు ప్రాధాన్యత కల్పించినట్టయింది.
నిజానికి 2010లో ప్రారంభించాలనుకున్న ఈ అవార్డును 2014లో మొదలుపెట్టారు. 2010-2014 సంవత్సరాలకు గాను సౌభాగ్య (సాభాగ్య కవిత), అరుణ్‌ సాగర్‌ (మేల్‌ కొలుపు), షాజహానా (దర్దీ), నంద కిషోర్‌ (నీలాగే ఒకడుండేవాడు) లకు అవార్డులు ప్రదానం చేశారు. 2015 సంవత్సరం నందిని సిధారెడ్డి (ఇక్కడి చెట్ల గాలి), మోహన్‌ రుషి (జీరో డిగ్రీ), హిమజ (సంచీలో దీపం) లకు అందించారు. 2016 సంవత్సరం అవార్డులు ప్రసాదమూర్తి (పూలండోరు పూలు), శ్రీరామోజు హరగోపాల్‌ (రెండు దోసిళ్ళ కాలం ), సుజాత పట్వారి (పిట్టకు ఆహ్వానం) లకు ఈ నెల 29 న ప్రదానం చేయనున్నారు.
ఇలా తొలి అడుగు పురస్కారాల ద్వారా ప్రోత్సాహాన్ని పెంపొదించడం అయితే, ఆ అడుగుకు జోడుగా అందర్ని కలుపుతూ వెళ్ళే ప్రయత్నం, రొట్టమాకురేవులో లైబ్రరీని ఏర్పాటు చేయడం. దానికి కె.యల్‌. పుస్తకసంగమంగా పేరు పెట్టారు. లైబ్రరీ కేంద్రంగా చదవడం, రాయడం, చర్చించడం లాంటి విషయాలు కొంతైనా జరగాలని కోరిక. లైబ్రరీ కోసం పుస్తకాల సేకరణలో తొలుత గుంటూరు నుండి రావెల పురుషోత్తమరావు గారి పుస్తకాలతో శుభారంభం జరిగింది. పుస్తకాలు ఇవ్వడానికి ఇంకా ఎందరో మిత్రులు సూచనప్రాయంగా తెలియజేశారు. అలాగే, కవి దేశరాజు 100కు పైగా పుస్తకాలను యింటికి వచ్చి యిచ్చి వెళ్ళారు. ఇంకా పుస్తకాల్ని సేకరించి గ్రంథాలయాన్ని పరిపుష్టం చేయాలన్నది కవి యాకూబ్‌ సంకల్పం. కనుక సాహిత్యాన్ని ప్రేమించేవారు ఈ 'పుస్తక సంగమం' కోసం పుస్తకాల్ని అందజేస్తే ఎందరికో ఉపయోగం చేకూరుతుంది.
సాహిత్యకేంద్రాలుగా నగరాలు, పట్టణాలే కాదు, గ్రామాలు కూడా వర్థిల్లాల్సిన అవసరముంది. అందుకు నిరూపమానమైన ఉదాహరణగా రొట్టెమాకు రేవు గ్రామం నిలిచిపోవాలన్నది యాకూబ్‌ ఆకాంక్ష. ఇందులో భాగంగా ఈ నెల 29 ఆదివారం నాడు రోజంతా జరిగే సాహిత్య కార్యక్రమానికి హాజరు కావలసిందిగా కవుల్ని, రచయితల్ని యాకూబ్‌ ఆహ్వానిస్తున్నాడు. తన గ్రామానికి తరలి రావాల్సిందిగా కోరుతున్నాడు. ప్రత్యేకించి ఆదివాసీలు ఎక్కువగా నివసించే రొట్టెమాకు రేవు సందర్శనం తెలంగాణ పల్లె జీవితంలోని మరో పార్శ్వాన్ని తెలుసుకోడానికి ఉపకరిస్తుంది. అందుకని చక్కటి సృజనాత్మక అనుభవం కోసం 29న రొట్టెమాకు రేవులో జరిగే పురస్కారాల సంరంభంకు హాజరు కావడం మంచిది.
- కిరణ్‌కుమార్‌
29న అవార్డు ప్రదాన సభ
ఖమ్మం జిల్లా కారేపల్లిలోని రొట్టమాకురేవులో జనవరి 29న జరిగే నుండి 'రొట్టమాకు రేవు కవిత్వ అవార్డు 2016' ప్రదాన సభలో ప్రసాదమూర్తి (పూలండోరు పూలు), శ్రీరామోజు హరగోపాల్‌ (రెండు దోసిళ్ళ కాలం), సుజాతా పట్వారి (పిట్టకు ఆహ్వానం) లకు అవార్డులు ప్రదానం చేస్తారు. ఇందులో గోరటి వెంకన్న ,పల్లా రాజేశ్వరరెడ్డి, ఎం.ఎల్‌.సి., వాడ్రేవు చినవీరభద్రుడు, పలమనేరు బాలాజీ, ప్రసేన్‌,సీతారాం, వంశీకష్ణ, మువ్వా శ్రీనివాసరావు తదితరులు పాల్గొంటారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణలో దీర్ఘకవితల ప్రస్థానం
చిత్ర నిర్మాణంపై విలక్షణ నవల
గడువు
అంతఃసూత్రం
సాహిత్యవార్తలు
లోతైన అనుభవానికి సరైన వ్యక్తీకరణ
సింగిడి తునుక
జలజపం చేసిన కవి
ఆ అడవిలో...
సారవంతమైన కథల సమాహారం
స్నేహ శీలతకు నవలా రూపం
సాహిత్యవార్తలు
అభ్యుదయ సృజన ఒక బాధ్యత
కదిలించే కవిత్వం...
కవిత్వంలో మొదటి కోండ్ర
సాహిత్యవార్తలు
స్వేచ్ఛా జీవులు
కొత్త నడక
ప్రయోగాత్మక కవిత్వం - విమర్శ
అమ్మకోసం రాసిన కవిత్వం
నా భాష - నా శ్వాస
రాఖీ 'ఫెంటోలు'
కలాలు మాట్లాడుతాయి !
లేనిచోటు
సాహిత్యవార్తలు
ఇతివృత్త వైవిధ్యం- ఆకర్షించే కథన కౌశలం
పరిమళాన్ని వెదజల్లే నల్లచామంతి
పల్లెతల్లుల చెమటకాలువ ఉద్దరాశిపూలచెట్టు
పుస్తక మొగ్గలు
ఛాయా ఆహ్వానం
Sundarayya

Top Stories Now

veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi

_

తాజా వార్తలు

09:25 PM

పాకిస్థాన్ లో అడుగుపెట్టిన సౌదీ యువరాజు

09:23 PM

ఇండియా గేట్ వద్ద అమర జవాన్లకు నివాళులు

09:19 PM

జాతీయజెండాను కాళ్ళకిందేసి తొక్కిన యువకుడు

09:17 PM

10 నిమిషాల్లో రూ.17.5 లక్షల విరాళాల సేకరణ

09:13 PM

పోలీసులకు చుక్కలు చూపించిన మందు బాబుపై కేసు నమోదు

09:05 PM

యువత అసహనంలో కూరుకుపోయింది : మన్మోహన్‌ సింగ్‌

09:01 PM

లారీ ఢీకొని ముగ్గురు మృతి

09:00 PM

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు..

08:58 PM

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

08:52 PM

పసికందు మృతి, హాస్పటిల్ సీజ్ చేయాలని ఆందోళన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.