1. ఆగస్టు 1942 లో క్విట్ ఇండియా ఉద్యమం మొదల య్యింది. దీని తర్వాత కాలంలో మహాత్మాగాంధీని అరెస్ట్ చేసి ఎక్కడుంచారు?
ఎ) ఆగా ఖాన్ పాలెస్, పూనా
బి) బంకూర
సి) అల్మోర జైలు డి) అలీగఢ్
2. సెప్టెంబర్, 1932లో పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది?
ఎ) మహాత్మా గాంధీ-డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
బి) తిలక్- లాలా లజపతి రారు
సి) రామ్ సే మెక్ డోనాల్డ్
డి) మహాత్మా గాంధీ-ఇర్విన్
3. మహాత్మా గాంధీ హాజరైన రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు నిర్వహించారు?
ఎ) నవంబర్-1930
బి) సెప్టెంబర్-డిసెంబర్, 1931
సి) నవంబర్ 17 నుండి డిసెంబర్ 24, 1932
డి) 1942
4. తొలుత 'సత్యాగ్రహ ఆశ్రమం' అని పిలిచిన, ఆ తర్వాత కాలంలో సబర్మతి ఆశ్రమం అని పిలువబడినది. దీన్ని జీవన్ లాల్ దేశారు కోచారాబ్ బంగాళాలో, అహ్మదాబాద్లో తొలుత ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1927 బి) మే, 1915
సి) 1881 డి) 1919
5. మార్చ్ 12, 1930లో మహాత్మా గాంధీ స్వయంగా సబర్మతీ ఆశ్రమం నుండి దేన్నీ ప్రారంభించారు?
ఎ) దండి మార్చ్ (ఉప్పు సత్యాగ్రహం)
బి) ఖిలాఫత్ ఉద్యమం
సి) రౌలత్ సత్యాగ్రహం డి) గదార్ ఉద్యమం
6. మహాత్మా గాంధీ 1893 లో దక్షిణ ఆఫ్రికా వెళ్లి 1914 వరకు ఉన్నారు. 1915, జనవరిలో భారత దేశానికీ వచ్చారు. ఆ తర్వాత కాలంలో ఆయన వేటితో అనుబంధం కలిగి ఉన్నారు?
ఎ) విలేజ్ ఇండిస్టీస్ సొసైటీ
బి) బేసిక్ ఎడ్యుకేషన్ సొసైటీ
సి) గో రక్షణ అసోసియేషన్ డి) పైవన్నీ
7. ఇటీవల ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వానికి ఎంత మొత్తం ట్రాన్స్ఫర్ చేయదలిచింది? (రూ.లక్షల కోట్లలో)
ఎ) 1.76 బి) 0.50
సి) 0.306 డి) 0.658
8. బ్యాంకులు రెపో రేట్-లింక్లోన్ ప్రొడక్ట్స్ వేటిని ఇవ్వదల్చుకున్నాయి?
ఎ) హౌం లోన్స్
బి) వెహికల్ లోన్స్
సి) మార్టిగేజ్, క్యాష్-క్రెడిట్లోన్ ప్రొడక్ట్స్
డి) పైవన్నీ
9. 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను విలీనం చేసి నాలుగు అతి పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయదలిచింది, కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంకు, అల్లహాబాద్ బ్యాంకు కలిసి ఒకటిగా ఏర్పడతాయి. ఈ కింది వాటిలో ఏవేవి కలియనున్నాయి?
ఎ) పీఎన్బి, ఓబిసి, యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా
బి) కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు
సి) యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు డి) పైవన్నీ
10. కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు ఇవ్వదలిచిన రూ.55,000 కోట్లలో, ఏ బ్యాంకుకి అత్యధికంగా రూ.16,000 కోట్ల ధనం లభించనున్నది?
ఎ) పంజాబ్ నేషనల్ బ్యాంకు
బి) యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా
సి) బ్యాంకు ఆఫ్ బరోడా డి) కెనరా బ్యాంకు
11. యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఎవరు?
ఎ) జెన్స్ స్టోలేన్బర్గ్ బి) మిచెల్లీ బాచ్ లెట్
సి) గియాని ఇన్ఫినిటో డి) జీన్ క్లాడ్ జన్కర్
12. ఇటీవల నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ కాన్క్లేవ్ ఎక్కడ నిర్వహించారు?
ఎ) గాంగ్టక్ బి) కోహిమా
సి) గువాహటి, అసోం డి) ఇటానగర్
13. ఈ కింది వాటిలో, అస్సాంతో ఎక్కువ పొడవున్న సరిహద్దు గల రాష్ట్రం ఏది?
ఎ) సిక్కిం బి) బీహార్
సి) మేఘాలయ డి) ఒడిశా
14. మిజోరాం రాష్ట్రం ఏ దేశాలతో అంతర్జాతీయ సరి హద్దు కలిగి ఉంది?
ఎ) నేపాల్ బి) మయన్మార్, బంగ్లాదేశ్
సి) భూటాన్ డి) థాయిలాండ్
15. 'బాన్ ఛాలెంజ్' వివరాలు ఏవి?
ఎ) 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 150 మిలియన్ హెక్టర్ల డీ ఫారెస్టేడ్, డి గ్రేడేడ్ భూమిని రిస్టోర్ చేస్తారు (2030 నాటికీ 350 మిలియన్ హెక్టర్ల భూమిని రిస్టోర్ చేస్తారు)
బి) పారిస్లో 2015 లో నిర్వహించిన సీఓపీలో భారతదేశం 'బాన్ ఛాలెంజ్' లో చేరింది
సి) ఇటీవల భారతదేశం 2030 నాటికి, 26 మిలియన్ హెక్టర్ల డిగ్రెడేషన్ ల్యాండ్ను రిస్టోర్ చేస్తానని తెలిపింది
డి) పైవన్నీ
16. ల్యాండ్ డిగ్రెడేషన్ మీద, యుఎన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశం ఇటీవల ఇండియాలో నిర్వహిం చారు. ఇక్కడ విడుదల చేసిన 'డ్రాట్ టూల్ బాక్స్' లో గల మూడు మాడ్యుల్స్ వివరాలు ఏవి?
ఎ) కరువు మోనిటరింగ్, ఎర్లీ వార్నింగ్
బి) కరువు వల్నరబిలిటి, రిస్క్ మేనేజ్ మెంట్
సి) కరువు రిస్క్ మిటిగేషన్ మెజర్స్ (కరువు రిస్క్ని తగ్గించే చర్యలు)
డి) పైవన్నీ
17. భారత రాజ్యాంగంలోని ఎన్నవ ఆర్టికల్, భారత రాష్ట్ర పతికి, రాష్ట్ర గవర్నర్లను కాన్స్టిట్యూషనల్ ఇమ్యునిటి కల్పిస్తుంది?
ఎ) ఆర్టికల్ 371 బి) ఆర్టికల్ 361
సి) ఆర్టికల్ 21 డి) ఆర్టికల్ 2
18. యుఎస్ ఓపెన్ మహిళల సింగల్స్ విజేత బియాంక్ ఆండ్రీస్కూ, పురుషుల సింగిల్స్ విజేత రాఫెల్ నాదాల్, ఇంతవరకు రాఫెల్ నాదాల్ సాధించిన మేజర్ విజయాల వివరాలేవీ?
ఎ) ఆస్ట్రేలియా ఓపెన్ (ఒకసారి), ఫ్రెంచ్ ఓపెన్ (12 సార్లు)
బి) వింబుల్డన్ (2 సార్లు)
సి) యుఎస్ ఓపెన్ (4 సార్లు)
డి) పైవన్నీ
19. ఐర్లాండ్ బోర్డర్ (సరిహద్దు) వివరాలు ఏవి?
ఎ) ఇది, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్కి -ఉత్తర ఐర్లాండ్కి మధ్య గల సరిహద్దు, ఉత్తర ఐర్లాండ్, బ్రిటన్ అధీనంలో ఉంది. ఉత్తర ఐర్లాండ్ రాజధాని : బెల్ ఫాస్ట్.
బి) దీని పొడవు : సుమారు 499 కి.మీ. (310 మైల్స్)
సి) దీన్ని సాఫ్ట్ బోర్డర్ అంటారు. ఎందుకంటే, ప్రత్యేకంగా నిర్మించిన గోడలు, సరిహద్దులు, కఠినమైన కాపలా షరతులు లేవు. ప్రజలు స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతుంటారు.
డి) పైవన్నీ (బ్రెక్సిట్ సందర్భంగా, ఈ అంశం ప్రత్యేకత సంతరించుకుంది)
20. తెలంగాణా రాష్ట్ర 2019-20 బడ్జెట్ సందర్భంగా ఇటీవల వెల్లడించిన వివరాలేవీ?
ఎ) 2018-19 లో తెలంగాణా రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు : సుమారు 14.8 శాతం
బి) 2018-19 లో తెలంగాణా రాష్ట్ర జీఎస్డీపీ అంచనా : రూ. 8.65 లక్షల కోట్లు
సి) తెలంగాణాలో తలసరి ఆదాయం (2018-19లో) రూ. 2.05 లక్షలు (కరెంటు ధరలలో)
డి) పైవన్నీ
21. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన 2019-20 తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ వివరాలేవీ?
ఎ) వార్షిక బడ్జెట్ లో మొత్తం వ్యయం : రూ. 1,46, 30 కోట్లు
బి) రెవిన్యూ వ్యయం : రూ. 1,11, 055, 84 కోట్లు
కాపిటల్ వ్యయం : రూ. 17,274,67 కోట్లు
సి) రెవిన్యూ మిగులు : రూ. 2, 044, 88 కోట్లు
(ఫిస్కల్ లోటు : రూ. 24, 081,74 కోట్లు
డి) పైవన్నీ
22. ఏ రాష్ట్రాలలో టెంపరరిగా కొన్నాళ్ళు నివశించాలంటే, 'పర్మిట్' తీసుకోవాలి?
ఎ) అరుణాచల్ ప్రదేశ్ బి) మిజోరాం
సి) నాగాలాండ్ డి) పైవన్నీ
23. కామాఖ్యా టెంపుల్ ఎక్కడుంది?
ఎ) శ్రీనగర్ బి) బుద్ధ గయ
సి) గువహాటి, అస్సాం డి) మథుర
24. భారత దేశంలో ఆగస్టు, 2019 లో ఆటోమొబైల్ సేల్స్ 23, 55 శాతం తగ్గింది. కారణాలు ఏవి?
ఎ) బలహీనమైన కన్స్యూమర్ సెంటిమెంట్ (ఎకనామిక్ గ్రోత్ తగ్గిపోవడం, మధ్యలో)
బి) ఎన్బీఎఫ్సీ ల సంక్షోభం వల్ల ఏర్పడ్డ లిక్విడిటి క్రంచ్
సి) జీఎస్టీ రేటు, భవిష్యత్తులో తగ్గ వచ్చని వినియోగ దారులు, వాహనాలు కొనడం వాయిదా వేయడం
డి) పైవన్నీ
25. భారతదేశంలో, మొత్తం ఉప్పు ఉత్పత్తిలో 99 శాతం ఉప్పుని ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి?
ఎ) గుజరాత్ బి) రాజస్థాన్
సి) తమిళనాడు డి) పైవన్నీ
26. ఇటీవల నియమించబడిన కొత్త గవర్నర్లు ఎవరు?
ఎ) తెలంగాణా : డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, రాజస్థాన్ : కల్రాజ్ మిశ్రా
బి) మహారాష్ట్ర : భగత్ సింగ్ కోష్యారి, హిమాచల్ ప్రదేశ్ : బండారు దత్తాత్రేయ
సి) కేరళ : ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్
డి) పై అందరూ
27. జోర్డాన్ పేరుతో ఏవి ఉన్నాయి?
ఎ) జోర్డాన్ దేశం (ఇజ్రాయిల్ దేశం దగ్గర)
బి) జోర్డాన్ నది (ఇది గలీలి సముద్రం నుండి డెడ్ సీ వరకు ప్రవహిస్తుంది)
సి) జోర్డాన్ లోయ డి) పైవన్నీ
28. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ మార్కెట్ ఇంటర్ వెన్షన్ ప్రైస్ స్కీం ను, ఇటీవల జమ్మూ, కశ్మీర్లో ఏ పంటకి అమలు చేసి కొనుగోలు చేయనున్నారు? వివరాలేవీ?
ఎ) యాపిల్స్
బి) ఎమ్ఐఎస్పీ కింద 12 లక్షల మెట్రిక్ టన్నుల యాపిల్స్ను నేషనల్ అగ్రికల్చర్ కో-పరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలుచేస్తారు
సి) 2018 లో కాశ్మీర్లో 20 లక్షల మెట్రిక్ టన్నుల యాపిల్స్ పండాయి
డి) పైవన్నీ
29. మోతీ హారి-అమ్లేఖ్ గంజ్ ఎనర్జీ పైప్ లైన్ వివరాలు ఏవి?
ఎ) పొడవు : 69 కి.మీ
బి) దీని ద్వారా సంవత్సరానికి రెండు మిలియన్ మెట్రిక్ టన్నుల శుభ్రమైన పెట్రోలియం ఉత్పత్తులు పంపవచ్చును
సి) భారత్ నుండి నేపాల్కు ఆయిల్ ఉత్పత్తులు దీని ద్వారా పంపుతారు
డి) పైవన్నీ
సమాధానాలు
1.ఎ 2.ఎ 3.బి 4.బి 5.ఎ 6.డి 7.ఎ 8.డి
9.డి 10.ఎ 11.బి 12.సి 13.సి 14.బి 15.డి
16.డి 17.బి 18.డి 19.డి 20.డి 21-డి 22-డి
23-సి 24-డి 25-డి 26-డి 27-డి 28-డి 29-డి