Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వణుకెందుకు...?! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 19,2020

వణుకెందుకు...?!

పార్లమెంటు శీతాకాలపు సమావేశాలను రద్దు చేయాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ పార్లమెంటరీ ప్రజా స్వామ్యానికి ఆచరణలో ఏపాటి విలువనిస్తున్నదో తేటతెల్లం చేస్తున్నది. ఎవరు అధికారంలో ఉండాలో నిర్ణయించేంతవరకే ప్రజాస్వామ్యం తప్ప ఏ విధంగా ప్రభుత్వం నడుస్తున్నదో ఎప్పటికప్పుడు నిగ్గుతేల్చే చట్టసభల సమావేశాలకు అంతగా ప్రాధాన్యత లేదని మోడీ ప్రభుత్వం చెప్పకనే చెప్తోంది. మోడీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ 2020 సంవత్సరంలో కేవలం 33రోజులు మాత్రమే మన లోక్‌సభ పని చేసినట్టయింది. ట్రంప్‌ పర్యటనకు, బీహార్‌ ఎన్నికలకు, పలు ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీలకు, శాసన మండళ్ళకు జరిగిన ఉప ఎన్నికలకు, అయోధ్యలో ఆలయ శంకుస్థాపనకు ఆటంకం కాని కోవిడ్‌-19 ఈ శీతాకాలపు పార్లమెంటు సమావేశాలకు మాత్రమే అడ్డం వచ్చిందా?
ఇప్పటికన్నా ఇంకా ఉచ్ఛ స్థాయిలో కోవిడ్‌-19 ప్రభావం చూపుతున్నప్పుడు కూడా తమ కార్పొరేట్‌ ఎజెండాను అమలు చేయాలనుకున్నప్పుడు కేంద్రం పార్లమెంటును నడిపింది. రికార్డు సంఖ్యలో అత్యధికంగా 40కి పైగా చట్టాలను ఆమోదింపజేసుకుంది. వాటిలో అత్యధికం ప్రజా వ్యతిరేకమైనవి. కార్మికుల నుంచి, రైతాంగం నుంచి వాటికి తీవ్ర ప్రతిఘటన ఇప్పటికే మొదలైంది. ఈ ఉద్యమాల ద్వారా ప్రజలు సంధించిన పలు ప్రశ్నలకు పార్లమెంటులో సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. తమ కార్పొరేట్‌ సేవా తత్పరత, ప్రజా వ్యతిరేకత నగంగా మరోసారి పార్లమెంటు సాక్షిగా వెల్లడవుతుందన్న భయమే మోడీ ప్రభుత్వం సమావేశాలనే జరపకుండా మొహం చాటేసేందుకు నెట్టింది.
అంతర్జాతీయంగా సవాలుగా మారిన ఆర్థిక సంక్షోభ ప్రభావం తక్కిన దేశాల కన్నా మన దేశం మీద చాలా ఎక్కువగా పడింది. ఈ వాస్తవాన్ని కప్పిపెట్టడానికి మోడీ ప్రభుత్వం నానా తంటాలూ పడుతోంది. కానీ ఆ సంక్షోభ భారాలు ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీడీపీ వృద్ధి పతనం రూపాల్లో అనునిత్యం బయటపడుతూనే ఉన్నాయి. కరోనా కాలంలో ప్రజలను ఆదుకునే ఉద్దీపన పథకాలను ఏదోఒక మేరకైనా తక్కిన దేశాలు అమలు చేశాయి కాని మోడీ సర్కారు మాత్రం ఉద్దీపనను కార్పొరేట్లకే పరిమితం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను పతనపుటంచులకు తీసుకువచ్చిన బీజేపీ దివాళాకోరుతనం పార్లమెంటులో చర్చకు వస్తే ఎదుర్కోగలిగిన నిజాయితీ మోడీ ప్రభుత్వానికి లేదు గనుకనే శీతాకాలపు సమావేశాలను రద్దు చేసి రగ్గు కప్పేసుకుంటోంది. ఇరుగు పొరుగు దేశాలతో మన సంబంధాలు దిగజారి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. మైనారిటీలను, దళితులను లక్ష్యంగా చేసుకుని బీజేపీ సాగిస్తున్న దాడులు జాతీయంగా, అంతర్జాతీయంగా చర్చనీయాంశాలయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ-హిందూత్వ శక్తులు రెచ్చగొట్టే అవాస్తవిక భావావేశాల ఎజెండా పక్కకు పోయి దేశం, ప్రజలు ఎదుర్కుంటున్న వాస్తవికమైన, దైనందిన జీవితపు ఎజెండా ముందుకొచ్చింది. ఈ సెక్యులర్‌ ఎజెండాపై చర్చించడానికి బీజేపీకి ధైర్యం లేదు. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోడానికి ఈ ఎజెండా అనుమతించదు.
వానాకాలపు సమావేశాల వరకూ వెంట వచ్చిన మిత్రపక్షాలు ప్రజా ఉద్యమాల నేపథ్యంలో ఒకటొకటిగా ముఖం చాటేస్తున్నాయి. సంక్షోభ సమయంలో రాష్ట్రాలను ఆదుకునే బదులు వాటి వనరులను సైతం కాజేసిన పెద్దన్న పట్ల అవి గుర్రుగా ఉన్న సమయంలోనే వెల్లువెత్తిన రైతాంగ ఉద్యమం పలు ప్రాంతీయ పార్టీల వైఖరిని ప్రభావితం చేస్తోంది.
ఇటీవల నూతన పార్లమెంటు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని ఆ సందర్భంగా పాత పార్లమెంటుకు కాలం చెల్లిందని నర్మగర్భంగా వ్యాఖ్యా నించారు. అయితే ప్రజాస్వామ్యం పాతబడిపోయిన భవనం లాంటిది కాదు. తమకు వీలైనట్టు కూల్చివేయ వచ్చుననుకుంటే సాధ్యమూ కాదు. లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల బీజేపీకి ఎంత చిన్నచూపు ఉందో దేశంలో ప్రజాస్వామ్య శక్తులు ఇప్పటికే గమనించాయి, అర్థం చేసుకున్నాయి. పరిరక్షించుకు నేందుకు సమాయత్తం అవుతున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను ఇకముందైనా నిజాయితీగా పాటించడానికి సిద్ధపడకపోతే మోడీ ప్రభుత్వానికి ఆ శక్తులు తగిన పాఠం నేర్పడం ఖాయం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆవు.. సైన్సూ.. అజ్ఞానమూ
నియంతల నియంత్రణ
విపత్తు నేర్పుతున్న పాఠం
మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
అమ్మపలుకు
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం
శాస్త్రీయ దీప్తి
పీఆర్‌సీ.. పీఆర్‌సీ.. పీఆర్‌సీ..!
ప్రతిఘటిస్తూ జీవిస్తున్న క్యూబా
భజన పరాయణత్వం!
దీపదారులు
హల్వా వారికే!

తాజా వార్తలు

09:55 PM

శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్

09:44 PM

ఎర్రగడ్డలో 125 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

09:39 PM

వాట్సాప్‌లో ఈపీఎఫ్‌వో సేవలు ప్రారంభం

09:27 PM

నాయ్యవాదుల హత్యకు వాడిన కొడవళ్ల కోసం గాలింపు

09:20 PM

నల్లగొండలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

09:02 PM

తెలంగాణ జానపదానికి సాయి ప‌ల్ల‌వి అదిరిపోయే స్టెప్పులు

08:46 PM

సినీ ఇండస్ట్రీలో విషాదం...

08:38 PM

చావు క‌బురు చ‌ల్ల‌గా..ప్రోమోలో అద‌ర‌గొట్టిన అన‌సూయ‌

08:30 PM

ఒకే వేదికపై 3,229 వివాహాలు

08:20 PM

నిరసనకారులపై కాల్పులు: ఏడుగురు మృతి

07:36 PM

నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి చితకబాదారు...

07:17 PM

పేపర్‌ లీక్‌..రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రద్దు

07:07 PM

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సంచలన వ్యాఖ్యలు

06:51 PM

సోలార్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

06:38 PM

ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు

06:28 PM

వాలంటీర్ల సేవలపై సంచలన ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

06:15 PM

బస్సు డ్రైవర్లుగా మాజీ క్రికెటర్లు..!

05:56 PM

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

02:49 PM

ఆ లింకులను వాట్సాప్ ద్వారా పంపొద్దు: సుప్రీంకోర్టు

02:23 PM

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.