Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
టీకా రాజకీయం | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 07,2021

టీకా రాజకీయం

భారత్‌ బయోటెక్‌-ఐసిఎంఆర్‌ తయారు చేస్తున్న 'కోవాగ్జిన్‌' మూడవ దశ క్లినికల్‌ పరీక్ష పూర్తి కాకుండానే దీనిని వినియోగానికి అనుమతించడం మోడీ మార్క్‌ టీకా రాజకీయానికి నిదర్శనం. ఈ దేశీయ టీకా ' భారత్‌కే గర్వకారణం', 'కరోనాపై పోరులో నిర్ణయాత్మక మలుపు' అంటూ మోడీ, ఆయన వంది మాగధులు అదే పనిగా ఊదరగొడుతున్నారు. కోవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కోవడంలోను, ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలోకి దిగజారకుండా నిలువరించడంలో మోడీ ప్రభుత్వ వైఫల్యం కళ్లెదుట కనిపిస్తున్న వాస్తవం. వీటిని కప్పిపుచ్చుకునేందుకు కోవాగ్జిన్‌ టీకాను అది ఒక అస్త్రంగా వాడుకోవాలని చూడడం నీతిమాలిన చర్య. మూడవ దశ పరీక్షలో ఉండగా ఒక టీకాను ఈ విధంగా అత్యవసర వినియోగానికి అనుమతించడం ప్రమాదకరం. పోలియో వ్యాక్సిన్‌ వచ్చినప్పుడు దానిపై ఎలాంటి వివాదమూ లేదు. సీరమ్‌ అభివద్ధి చేసిన 'కోవిషీల్డ్‌' వ్యాక్సిన్‌కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సిడిఎస్‌సిఓ) ఆమోదం తెలిపినప్పుడు దానికి ఎవరూ అభ్యంతరపెట్టలేదు. కోవాగ్జిన్‌పై వివాదం తలెత్తడానికి ప్రభుత్వ బాధ్యతారహిత వైఖరే కారణం. 26 వేల మంది వలంటీర్లపై ప్రయోగం జరపాల్సి ఉండగా, ఇంతవరకు 23 వేల మందిపైనే ప్రయోగించారు.
ఆ ప్రయోగాల మూడో దశ ఫలితాలు రావడానికి 2 నుండి 10 నెలల సమయం పడుతుంది. అంతవరకు వేచి ఉండకుండా ఇంతలోనే దీనికి కేంద్ర డ్రగ్‌ కంట్రోల్‌ సంస్థకు చెందిన సబ్జక్టు నిపుణుల కమిటీ ఎలా ఆమోదం తెలిపింది? ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడమే. దీనిపై రాజకీయ పార్టీలే కాదు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీరమ్‌-ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెన్‌ తయారు చేసిన కోవిషీల్డ్‌ టీకా డోసులు అయిదు కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. అటువంటప్పుడు కో వ్యాక్సిన్‌ సురక్షితమని, ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్సు ఉండవని నిర్ధారణ అయ్యేవరకు ఎందుకు ఓపిక పట్టలేక పోయారు? ఈ టీకా కొనుగోలుకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధర ఎంత? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
కోవిడ్‌పై పోరులో ముందు పీఠిన నిలిచిన వైద్య , భద్రతా సిబ్బందికి ఈ టీకాను మొదట వేస్తామంటున్నారు. ఈ వ్యాక్సిన్‌ తుది ట్రయల్స్‌కు సంబంధించిన డేటా ఏదీ వెల్లడికాక మునుపే వైద్యులను ప్రయోగాలకు బలిపశువులను చేస్తారా? ప్రభుత్వ తొందరపాటుతనం ప్రజల ప్రాణ సంకటంగా మారకూడదు. కోవాగ్జిన్‌ టీకాతోనే కరోనా మహమ్మారిపై విజయం సాధించేసినట్లు మోడీ ప్రభుత్వం చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం. దేశంలోని మొత్తం 130 కోట్ల మంది వుంటే, మూడు కోట్ల మందికి మాత్రమే మొదటి విడతలో టీకాలు అందుబాటులో ఉంటాయి. అదీ గాక ఈ టీకాలు ఎంతవరకు ఫలితమిస్తాయో అనుభవంలో కానీ తేలదు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో టీకాలు వేసే కార్యక్రమం ఇప్పటికే చేపట్టారు. అయినా, అక్కడ కోవిడ్‌ కేసులు ఆగలేదు. కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వ అసమర్థ నిర్వాకానికి తార్కాణం కరోనా కేసులు, మరణాల్లో ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానంలో నిలవడమే. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న దివాళాకోరు నయా ఉదారవాద విధానాలు కరోనా విజంభణకు మరింత ఆజ్యం పోశాయి. కరోనా కాలంలో ప్రకటించిన ఉద్దీపన పథకాలు ప్రజలకన్నా కార్పొరేట్లకే ఎక్కువ ప్రయోజనం కలిగించాయి. స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో మొదటిసారి దేశ ఆర్థిక వ్యవస్థ నెగిటివ్‌ గ్రోత్‌లో పడింది. 2016-17లో 8.3 శాతంగా ఉన్న జిడిపి 2020-21లో మైనస్‌ 9.5 శాతానికి పడిపోయింది.
సిఎంఐఇ సర్వే ప్రకారం కరోనా కాలంలో 15 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చింది. ప్రజల జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయి. ఇటువంటి దయనీయ పరిస్థితి ఒక వైపు ఉంటే మరో వైపు దేశంలోని 15 మంది అత్యంత సంపన్నుల వద్ద సంపద ఈ కాలంలో 14 శాతం మేర పెరిగింది. ఈ పరిస్థితుల్లో దేశ వ్యాపితంగా నిరసనలు, ఆందోళ నలు తీవ్రతరమవుతున్నాయి. కార్పొరేట్ల దయా దాక్షిణ్యాలకు రైతులను, వ్యవసాయాన్ని వదిలిపెట్టే మూడు చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గత 40 రోజులుగా సాగిస్తున్న పోరాటం నయా ఉదారవాద విధానాలకు పెరుగుతున్న ప్రతిఘటనను తెలియజేస్తోంది. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికవర్గం పది మాసాల వ్యవధిలో రెండు భారీ సమ్మెలు నిర్వహించింది. మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై అన్ని వర్గాల ప్రజల్లో అసంతప్తి రగులుతోంది. కో వాగ్జిన్‌ను అడ్డం పెట్టుకుని తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవచ్చునని అనుకుంటే మోడీ పిచ్చివాళ్ల స్వర్గంలో ఉన్నట్టే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆమె
స్వేచ్ఛాపతనం
మయన్మార్‌ సైన్యం ఓడిపోక తప్పదు
టీకా కుతంత్రం
మండేకాలం.....
డొంక తిరుగుడు ప్రచారం
ఆవు.. సైన్సూ.. అజ్ఞానమూ
నియంతల నియంత్రణ
విపత్తు నేర్పుతున్న పాఠం
మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
అమ్మపలుకు
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం

తాజా వార్తలు

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

07:12 PM

చెరువులో పడి జాలరి మృతి

07:04 PM

నల్లమలలో అగ్నిప్రమాదం..

07:02 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

01:08 PM

టెయిలెండర్ల ఆటతీరుపై సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

12:32 PM

మిగిలిన కొడుకు శరీర భాగాలను మూట కట్టుకొని..!

12:18 PM

వీణవంకలో కరెంటు షాక్‌తో రైతు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.