Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
భజన పరాయణత్వం! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2021

భజన పరాయణత్వం!

అనేక మందిలో భక్తి పారవశ్యం కంటే స్వలాభాపేక్షే ఎక్కువ! నాయకమన్యుల దృష్టిలో పడితే ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక పదవిరాక పోతుందా, తానూ తన తోటి వాళ్ళలా ఎంతో కొంత వెనకేసుకోకపోతానా అనేది వర్తమాన పాలక 'తత్వశాస్త్రం'. దీనికి సజీవ నిదర్శనం మొన్న తెలంగాణ భవన్‌ముందు వెలిసిన ఓ ఫ్లేక్సీ! కేటీఆర్‌ని ''ఫ్యూచర్‌ ఆఫ్‌ తెలంగాణ'' అని రాసిన దానికంటే ''అప్పుడు రామ రాజ్యం, ఇప్పుడు రానున్నది రామన్న రాజ్యం'' అనేది తరచి చూస్తే భజన పాలే నిలువెల్లా దర్శనమిస్తుంది.
''నా విష్ణుః పృధివీ పతిః అన్నట్టు రాజులు దైవాంశ సంభూతులు. ఏ రాజ్యంలో కులధర్మాలు విధిగా ఆచరించబడ్తాయో ఆ రాజ్యంలోని రాజు శాంతి దాంతుల్తో ఇహ పరసుఖాల్ని పొందుతాడని..'' సత్యకాముడితో యాజ్ఞ వల్క్య మహర్షి చెప్తాడు (సి.వి.రాసిన సత్యకామ జాబాలి నుంచి).
రామరాజ్య స్థాపనే తమ లక్ష్యమన్న కమలనాథుల కలతో ఈ గులాబీ కార్యకర్త ఆశ సింక్రనైజ్‌ కావడాన్ని ప్రస్తుతానికి కాకతాళీయమే అనుకుందాం. ధర్మం నాలుగు పాదాలతో నడవడం రామరాజ్యం ప్రత్యేకతంటారు విశ్వాసులు. అంటే చాతుర్వర్ణ వ్యవస్థ ఊడలేసి ఉండటం. అందుకే నాటి పురోహిత వర్గం శూద్ర శంభూక వధ జరిపిస్తుంది. ఆ స్థితికి సమాజ చక్రాన్ని వెనక్కి తిప్పాలని కమలనాథుల ప్రయత్నం. అందుకు ఎప్పటికప్పుడు కొత్త సామంతుల్ని పోగు చేసుకుంటూనే ఉంటుంది కాషాయపార్టీ. సామ, దాన భేద, దండోపాయాల్ని అంటే సీబీఐ, ఈడీ, ఐటీ, విజిలెన్స్‌ శాఖల్ని యమపాశంతో పెనవేసి ప్రయోగిస్తే అనేక పాలకపార్టీలు గిలగిల్లాడి పాదాక్రాంతమవడం వర్తమాన వాస్తవం. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిన పరమసత్యమొకటుంది. అధినేత రాజకీయ ప్రయోజనాలే తెలంగాణ ప్రయోజనాలుగా ప్రకోపిస్తే సాధించుకున్న తెలంగాణ ఈనగాచి నక్కలపాలే అవుతుంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం.
వెనకటికి ''ఇండియానే ఇందిర! ఇందిర అంటేనే ఇండియా!'' అని అత్యవసర పరిస్థితిలో పారాయణం చేసిన 'కోటరీ' ఆపార్టీని ఎక్కడికి చేర్చిందో వెనక్కి తిరిగి చూస్తే కనపడే నిష్టుర సత్యం. ప్రజల ప్రయోజనాలు పాలక నేతల ప్రయోజనాలతో ఎన్నటికీ సరిసమానం కావు. నిమ్జ్‌ భూసేకరణ అయినా, పోలేపల్లి సెజ్‌ కార్మికుల ప్రయోజనాలైనా పాలకుల ప్రయోజనాలకు భిన్నంగా ఉంటాయి. ఆ మాటకొస్తే తెలంగాణ ప్రయోజనం అసలేకావు.
తెలంగాణ ఉద్యమంలో కోట్లాది సామాన్యులు భాగస్వాములైంది వారి జీవితాలు స్వరాష్ట్రం అయితేనే తెల్లారతాయని. కనీస వేతనాలందని కార్మికులు, మద్దతుధర దక్కని రైతులు, ఆరేండ్లు దాటినా 'మగ్గం' గిట్టుబాటుకాని నేతన్నలు ఉరితాళ్లనే నేస్తాలుగా నమ్ముకుంటూంటే వచ్చిన రాష్ట్రం తెచ్చుకున్న వారికి ఏమి మిగిల్చింది? అదే దొరతనం, అవే గడీల్లాంటి ''భవనాలు'', ఎవరికీ అందకుండా చిటారు కొమ్మన అధినేత. తిరుపతి వెంకన్నకైనా ధర్మ దర్శనం ఉంటుంది. కాని మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓన్లీ వి.ఐ.పి. దర్శనమే. సెక్రటేరియట్‌కే రాని సీఎం, ఆ దారిలోనే అనేకమంది అమాత్యులు. సచివాలయమే లేని 'మేక్‌ షిఫ్టు' ఆఫీసుల్లో సచివులు. బాధలు ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడ చెప్పుకోవాలో అర్థంకాని ప్రజలు. ఇదీ నేటి వ్యదార్థ జీవిత యధార్థ తెలంగాణ.
ఇది పైపై పూతలతో మెరుగయ్యే వ్యాధికాదు. పాలన మెరుగవకపోతే పాలితులు కాకవికలౌతారు. సాధించుకున్న తెలంగాణ అర్థం, పరమార్థంలేనియవుతాయి. ఈ దశలో పుత్రవాత్సల్యం కోసం ధృతరాష్ట్ర కౌగిలే ప్రత్యామ్నాయమని అధినేత తలపోయడం కొరివితో తలగోక్కోవడమే! గుడిని గుడిలో లింగాన్ని మింగి అరాయించుకోగలిగిన పార్టీ బీజేపీ. తనతో కలిసిన మిత్రపక్షాల్నే నిర్దాక్షిణ్యంగా నమిలి మింగేయడం దాని నైజం. డౌటుండే మా రాజులు అసోంలో ఎ.జి.పి.ని, ఆంధ్రాలో టీడీపీల ప్రారబ్దాల్ని పరిశీలించవచ్చు. ఢిల్లీ కెళ్లి కొత్వాలుకు, మూలవిరాట్‌కు వంగి వంగి దండాలు పెట్టొచ్చిన మరుక్షణం సంజయుడేమన్నాడో టీఆర్‌ఎస్‌ శ్రేణులు మర్చిపోకూడదు. పొర్లుదండాలు పెట్టినా కేసీఆర్‌ను కటకటాల్లోకి నెడ్తామంటాడు. అధినాయకులు అభయహస్తమిస్తూంటారు. లోకల్‌ లీడర్లు కాలు దువ్వుతుంటారు. ఇది వారి రీతి. దేశమంతటినీ కాషాయీ కరించాలనేది బీజేపీ లక్ష్యం. ఆ విధంగా గుత్త పెట్టుబడికి వ్యతిరేకత లేకుండా చూసుకోవడం ఆ లక్ష్యంలో అంతర్భాగం.
అందుకే ఎవరు ''భజన''లో నిమగమైనా తలయెత్తి దేశంలో జరిగే పరిణామాల్ని పరిశీలించకున్నా కాషాయ దాడిని నిలువరించలేరు. నాలుగు కోడ్‌లపై కార్మిక సమ్మెలైనా, మూడు వ్యవసాయ చట్టాలపై ఏకమవుతున్న రైతు ఉద్యమమైనా, దానిలో మమేకమవుతేనే సాధించుకున్న తెలంగాణకు సార్థకత ఉంటుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆవు.. సైన్సూ.. అజ్ఞానమూ
నియంతల నియంత్రణ
విపత్తు నేర్పుతున్న పాఠం
మండలిలో ప్రశ్నించే గొంతులుండాలి
కొలువులెక్కడ..?
మోడీ చెప్పిన ''ఆవు కథ''
అమ్మపలుకు
ఇంధనజాలం...
ఆధిపత్యమే లక్ష్యంగా...
'కరెంటు' బ్లాక్‌మెయిల్‌
నాగేటి చాళ్లలోనే ''ఉక్కు''
'రవి దిశ'ను మార్చలేరు...
ప్రేమసహిత జీవనం
గురువులపై వివక్షేల?
ప్రకృతి వికృతైన వేళ
ఈ తీర్పులు నిలిచేనా?
చిత్తశుద్ధిలేని చర్చలేల..?
క్యాచ్‌ 22
తీరిక
సంఘీభావరణం
మయన్మార్‌ లో ప్రజాస్వామ్యం ఖూనీ
కంచె
ఈ మౌనం దేనికి సంకేతం?
కార్పొరేట్‌ పాఠం
శాస్త్రీయ దీప్తి
పీఆర్‌సీ.. పీఆర్‌సీ.. పీఆర్‌సీ..!
ప్రతిఘటిస్తూ జీవిస్తున్న క్యూబా
దీపదారులు
హల్వా వారికే!
ప్రేమరాగం

తాజా వార్తలు

09:55 PM

శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్

09:44 PM

ఎర్రగడ్డలో 125 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

09:39 PM

వాట్సాప్‌లో ఈపీఎఫ్‌వో సేవలు ప్రారంభం

09:27 PM

నాయ్యవాదుల హత్యకు వాడిన కొడవళ్ల కోసం గాలింపు

09:20 PM

నల్లగొండలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

09:02 PM

తెలంగాణ జానపదానికి సాయి ప‌ల్ల‌వి అదిరిపోయే స్టెప్పులు

08:46 PM

సినీ ఇండస్ట్రీలో విషాదం...

08:38 PM

చావు క‌బురు చ‌ల్ల‌గా..ప్రోమోలో అద‌ర‌గొట్టిన అన‌సూయ‌

08:30 PM

ఒకే వేదికపై 3,229 వివాహాలు

08:20 PM

నిరసనకారులపై కాల్పులు: ఏడుగురు మృతి

07:36 PM

నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి చితకబాదారు...

07:17 PM

పేపర్‌ లీక్‌..రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రద్దు

07:07 PM

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సంచలన వ్యాఖ్యలు

06:51 PM

సోలార్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

06:38 PM

ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు

06:28 PM

వాలంటీర్ల సేవలపై సంచలన ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

06:15 PM

బస్సు డ్రైవర్లుగా మాజీ క్రికెటర్లు..!

05:56 PM

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

02:49 PM

ఆ లింకులను వాట్సాప్ ద్వారా పంపొద్దు: సుప్రీంకోర్టు

02:23 PM

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.